Friday, March 14Lend a hand to save the Planet

General News

Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్

General News
Oben Rorr EZ | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం ₹89,999 ధరకు విడుదల చేసింది. అర్బన్ యూత్ ను లక్ష్యంగా చేసుకుని ఆధునిక హంగులతో దీన్ని రూపొందించింది. ఈ కొత్త బైక్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది అవి.. 2.6 kWh, 3.4 kWh 4.4 kWh. Rorr EZ దాని డిజైన్, అధునాతన సాంకేతికత.. అందుబాటు ధరలతో నగర రవాణాను సమూలంగా మార్చే లక్ష్యంతో కంపెనీ దీనిని తీసుకువచ్చింది. ఆసక్తి గల కస్టమర్‌లు వెంటనే రూ.2,999 బుకింగ్ రుసుముతో Rorr EZని రిజర్వ్ చేసుకోవచ్చు. ఒబెన్ ఎలక్ట్రిక్ స్టోర్‌లలో టెస్ట్ రైడ్‌లు త్వరిత డెలివరీలను పొందవచ్చు. Oben Rorr EZ డిజైన్, పర్ఫార్మెన్స్.. సంప్రదాయ పెట్రోల్ బైక్ లలో ఉండే క్లచ్ హ్యాండ్లింగ్, వైబ్రేషన్‌లు, అధిక నిర్వహణ ఖర్చులు వంటి ఇబ్బందులు Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ లో ఉండవు. ఇది ఇది LE...

ZELIO Ebikes : సరికొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. సింగిల్ చార్జిపై 100కి.మీ మైలేజీ

General News
ZELIO Ebikes, : ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు ZELIO Ebikes, త‌న స‌రికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0 ని నవంబర్ 12న విడుదల చేయడానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ లో-స్పీడ్ స్కూటర్ ప్రతి ఛార్జ్‌కు 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. X-MEN 2.0 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ గ‌తంలో వ‌చ్చిన X-MEN మాదిరిగానే క‌నిపిస్తుంది. అయితే కొత్త వెర్ష‌న్ వెర్షన్ పనితీరు, డిజైన్ రెండింటిలోనూ అనేక అప్ డేట్ ల‌ను క‌లిగి ఉంది. విద్యార్థులు, ఆఫీస్‌ ఉద్యోగులు, ఇతర రైడర్‌లతో సహా నగర ప్రయాణికులకు ఇది అనుకూలంగా ఉంటుంది. దేశ‌వ్యాప్తంగా 250 డీల‌ర్‌షిప్స్‌ హర్యానాలోని హిసార్‌లోని లాడ్వాలో ZELIO కంపెనీకి సొంత‌ ఫెసిలిటీ ఉంది. ఇది 72,000 వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. X-MEN 2.0 భారతదేశంలోని విభిన్న రహదారి పరిస్థితులకు అనుగుణంగా అధిక-నాణ్యత ప్రమాణాలతో రూపొందించింది. ZELIO Ebikes 2021లో స్థాపించబడినప్పటి నుండి వేగంగా అ...

TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

General News, Green Mobility
TGSRTC Electric Buses | హైదరాబాద్ మహానగరం క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్ లో   హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామ‌ని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి ర‌వాణా, బిసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. pic.twitter.com/bh69GJsWiY — VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 29, 2024 ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సు (TGSRTC Electric Buses) ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం మా...

Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..

General News
Agri News  | తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోన‌స్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. మ‌రోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్‌ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సోమ‌వారం సెప్టెంబర్ 16 సచివాలయంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ భేటీ అయిన సబ్ కమిటీ.. రేషన్, హెల్త్ కార్డుల జారీ విధివిధానాలపై చ‌ర్చ‌లు జ‌రిపింది. ఈ స‌మావేశం అనంతరం స‌మావేశంలో తీసుక‌న్న నిర్ణ‌యాల‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాకు వెల్ల‌డించారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అన్న‌దాత‌ల‌కు ...

Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక

General News
Model Solar City | రామ జన్మభూమి అయోధ్యను “మోడల్ సోలార్ సిటీ (Model Solar City)”గా అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని, దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. అయోధ్య తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశంలోని మరో 16 నగరాలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన సోమవారం వెల్లడించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రాముడి జన్మస్థలం. అతడు సూర్యవంశీ. (Ayodhya) రాముడి అద్భుతమైన ఆలయం నిర్మించాం. అయితే అయోధ్య ఒక మోడల్ సోలార్ సిటీ లక్ష్యంతో ముందుకుసాగుతోందని తెలిపారు. దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తోందని ప్రధాని మోదీ అన్నారు.“అయోధ్యలోని ప్రతి ఇల్లు సౌరశక్తితో నడపాలన్నదే మా ప్రయత్నం. మేము ఇప్పటివరకు అనేక ప్రాంతాలను సౌరశక్తితో అనుసంధ...

Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్క‌లు నాటిన వారికి ఇక‌పై అవార్డులు..

General News
VIJAYAWADA : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ సంవ‌త్స‌రం కోటి మొక్క‌ల‌ను నాటి సంర‌క్షిస్తామ‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టం చేశారు. వన మహోత్సవాన్ని (Vanamahotsavam-2024) పురస్కరించుకుని మంగళగిరిలోని ఎకో పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఏపీకి 50% పచ్చదనం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటాలని, అదే సమయంలో ఉన్న చెట్లను సైతం కాపాడడం మ‌రిచిపోవ‌ద్ద‌ని ప్రజలకు సూచించారు. హరితాంధ్ర కోసం పాటుపడదాం, మొక్కలు నాటండి అనే నినాదంతో వనమహోత్సవం-2024 కింద రాష్ట్రానికి 50 శాతం పచ్చదనం వచ్చేలా మీరందరూ బాధ్యత వహించాలని అన్నారు. వనమహోత్సవం (Vanamahotsavam-2024)లో పాల్గొన్న చిన్నారుల నుంచి సీఎం ప్రతిజ్ఞ చేయించారు. ‘‘మా పిల్లల భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యం. అందరం హరిత యజ్ఞంలో పాలుపంచుకుందాం.” ప్రతి ఇంటి ఆవరణ...

New FASTag Rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు అమలులోకి వచ్చేశాయి. ఇవి పాటించకుంటే ఇబ్బందే..

General News
New FASTag Rules | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) FASTag వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఇది మీ KYC ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు ప్రీ-పెయిడ్ ట్యాగ్ సదుపాయం, ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్‌ను నాన్‌స్టాప్‌గా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ ను మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అగిపోకుండా సాఫీగా వెళ్లిపోవడానికి FASTag KYC చెక్ ప్రవేశపెట్టారు. KYC అప్‌డేట్: FASTag వినియోగదారులు తమ KYC వివరాలను అక్టోబర్ 31 వరకు అప్‌డేట్ చేయాలి, ప్రత్యేకించి వారి FASTag 3 నుండి 5 సంవత్సరాల మధ్య ఉంటే తప్పనిసరి. పాత ఫాస్ట్‌ట్యాగ్‌ల భర్తీ: ఐదేళ్ల కంటే పాత ఏవైనా ఫాస్ట్‌ట్యాగ్‌లు తప్పనిసరిగా భర్తీ చేయాలి. వాహన వివరాలను లింక్ చేయడం: వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర...

Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఉన్న న‌గ‌రం ఇదే..

General News
Electric Bus | భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులను కలిగి ఉన్న మొదటి నగరంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడవ నగరంగా న్యూఢిల్లీ అవతరించింది. ఈమేర‌కు మంగళవారం ఢిల్లీలో కొత్త‌గా 320 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి, నగరంలో ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ సంఖ్య 1,970కి చేరుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాక‌పోక‌ల‌తో ఢిల్లీ కాలుష్యంపై పోరాటానికి బలం చేకూరుస్తుందని బాన్సెరాలో జరిగిన ఫ్లాగ్-ఆఫ్ కార్యక్రమంలో వీకే సక్సేనా చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "మేము 320 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నాం. ఇవి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయి. రాబోయే కాలంలో, ఇటువంటి మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉంటే, ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నేను భావ...
Exit mobile version