Harithamithra Telugu News

నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం: కేంద్రం ఇచ్చే రూ. 78 వేల సబ్సిడీని వదులుకోవద్దు!

PM Surya Ghar Scheme Subsidy | భారతదేశంలో పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ను ప్రవేశపెట్టింది. కోటి గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. రూ.75,021 కోట్ల భారీ బడ్జెట్‌తో ఫిబ్రవరి 13, 2024న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రధాన ముఖ్యాంశాలు i. ఈ పథకం కింద 2 […]

AIF Scheme | వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి : రూ.83,528 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

Agriculture News | రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలకమైన పంటకోత అనంతర మౌలిక సదుపాయాల అభివృద్ధి (Post Harvest Infrastructure) కి కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన Agriculture Infrastructure Fund (AIF) కింద భారీ స్థాయిలో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 1.65 లక్షలకు పైగా ప్రాజెక్టులకు రూ.83,528 కోట్లకు పైగా విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. ఇప్పటివరకు 1,46,789 ప్రాజెక్టులకు రూ.61,512 కోట్లు విడుదల కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే […]

భారత వ్యవసాయంలో AI విప్లవం : 7 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడీలు.. ‘భారత్-విస్తార్’తో కొత్త శకం! – Digital Agriculture Mission

హరితమిత్ర : భారత వ్యవసాయ రంగం డిజిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (Digital Agriculture Mission) కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 7.63 కోట్లకు పైగా రైతుల ఐడీలను (Farmer IDs) సృష్టించినట్లు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. అలాగే 23.5 కోట్ల పంట ప్లాట్లను డిజిటల్ పద్ధతిలో సర్వే చేసి, వ్యవసాయానికి ఒక బలమైన ‘డిజిటల్ వెన్నెముక’ను నిర్మించింది. అంశం ప్రస్తుత పురోగతి రైతు […]

జాతీయ ఉద్యానవన మిషన్ (NHM): పండ్లు, పూల సాగుపై భారీ సబ్సిడీలు.. రైతులకు లాభాల పంట!

National Horticulture Mission Subsidy | సంప్రదాయ వ్యవసాయం కంటే లాభసాటిగా ఉండే ఉద్యానవన పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉద్యానవన మిషన్ (National Horticulture Mission) ద్వారా భారీగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ఉద్యానవన సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ, సాంకేతిక మార్గనిర్దేశం, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో […]

రైతులకు అలెర్ట్: రైతులకు కేంద్రం కొత్త రూల్: ఆధార్ తరహాలో ‘ఫార్మర్ ఐడి’.. ఇది లేకపోతే పీఎం కిసాన్ పైసలు రావు!

Unique Farmer ID Registration Telangana : రైతులకుప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘అగ్రిస్టాక్’ (AgriStack) అనే డిజిటల్ నెట్‌వర్క్‌ను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య (Unique Farmer ID) కేటాయించేందుకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రక్రియను ప్రారంభించింది. ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి? తెలంగాణలోని చిన్న, పెద్ద రైతులందరూ ఈ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. […]

Urea Booking App | ఇకపై యాప్ ద్వారా యూరియా బుకింగ్.. క్యూ లైన్లకు చెక్!

Urea Booking App | రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. యూరియా పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు ‘ఎరువుల బుకింగ్ యాప్‌ ను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గందరగోళానికి తెర: గత ఖరీఫ్ సీజన్‌లో […]

Kisan Diwas : రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ టాప్ 10 పథకాలు

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు అందిస్తున్న సేవలను గౌరవిస్తూ, భారతదేశ 5వ ప్రధానమంత్రి, రైతు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయ‌కుడు చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న కిసాన్ దివస్ (Kisan Diwas 2025 – జాతీయ రైతు దినోత్సవం) ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భూ సంస్కరణలు అమలుచేయడంలో, రైతుల హక్కుల పరిరక్షణలో చరణ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ […]

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150, […]

PM Kisan Scheme | రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ 18 విడత డబ్బులు రూ.2000 వచ్చేశాయ్..

18వ విడత కింద 9.4 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పంపిణీ PM Kisan Scheme  | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడతను అక్టోబర్ 5, 2024న మహారాష్ట్రలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థికసాయం అందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా 20,000 కోట్లు జమ అయ్యాయి. దేశవ్యాప్తంగా […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates