
EV Price Hike : కొత్త ఏడాదిలో ఏథర్ షాక్:
జనవరి 1 నుండి పెరగనున్న స్కూటర్ల ధరలు!బెంగళూరు/హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను (EV Price Hike ) పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.ధరల పెంపునకు ప్రధాన కారణాలు ఇవీ:అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరలు పెరగడం, ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత, ముఖ్యంగా భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ. 91.01కి పడిపోవడం (డిసెంబర్ 2025 నాటి కనిష్ట స్థాయి) వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశాయని కంపెనీ పేర్కొంది. ఈ ఇన్పుట్ ఖర్చుల భారం తగ్గించుకోవడానికి ధరలను రూ. 3,000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.'ఎలక్ట్రిక్ డిసెంబర్' ఆఫర్లను వినియోగించుకోండి!కొత్త ధరల ప్రభావం పడకుండా ఉండాలంటే.. ఈ డిసెంబర్ నెలాఖరులోపు స్కూటర్ కొన...









