
రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.
Jeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడిగా వినియోగించడం వల్ల భూమి నిస్సారమైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది.ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు ముఖ్యమైన చక్రాలు ఉన్నాయి.జీవామృతంబీజామృతంఆచ్ఛాదన (మల్చింగ్)నీటి యాజమాన్యంవీటిలో భూమికి నేరుగా జీవం పోసేది జీవామృతం.జీవామృతం అంటే ఏమిటి?జీవామృతం అనేది పశువుల పేడ, మూత్రం ఆధారంగా తయారయ్యే సహజ ద్రవరూపంలో ఉంటే ఎరువు. ఇది భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను మేల్కొలిపి, మొక్కలకు అవసర...








