Saturday, February 8Lend a hand to save the Planet
Shadow

Green Mobility

TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వ‌ర‌లో సీఎన్‌జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ

TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వ‌ర‌లో సీఎన్‌జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ

Green Mobility
TVS Jupiter CNG : బజాజ్ ఆటో నుంచి బ‌జాజ్ ఫ్రీడ‌మ్ పేరుతో సీఎన్‌జి బైక్ విడుద‌లైన తర్వాత, ఇప్పుడు టీవీఎస్ కూడాత‌న మొట్ట‌మొదటి CNG స్కూటర్ విడుదల చేయ‌డానికి సిద్ధ‌మైంది .ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్‌జీ స్కూట‌ర్ ను ఆవిష్కరించింది.జూపిట‌ర్ స్కూటర్‌లో CNG ట్యాంక్‌ని వినూత్న రీతిలో అమ‌ర్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ ఏడాదిలోనే విడుదల చేయ‌న‌న్న‌ట్లు తెలుస్తోంది. కొత్త స్కూటర్ ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 95000 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. కాగా టివిఎస్‌ జూపిటర్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,174 నుండి రూ. 99,015 వరకు ఉంది.TVS Jupiter CNG : మైలేజీటీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.4 కిలోల బ‌రువున్న‌ సిఎన్‌జి ఫ్యూయల్ ట్యాంక్ ను సీటు కింద ఉన్న బూట్-స్పేస్ ప్రాంతంలో అమ‌ర్చారు. కంపెనీ ప్రకారం.. జూపిటర్ సేఫెస్ట్ CNG స్కూటర్. జూపిటర...
Battery Electric Vehicle : భ‌విష్య‌త్తంతా ఎల‌క్ట్రిక్ కార్ల‌దే.. ఆటోమొబైల్ రంగంలో విప్ల‌వం

Battery Electric Vehicle : భ‌విష్య‌త్తంతా ఎల‌క్ట్రిక్ కార్ల‌దే.. ఆటోమొబైల్ రంగంలో విప్ల‌వం

Green Mobility
Battery Electric Vehicle : ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మ‌క‌ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక భ‌విష్య‌త్తంతా బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలదేన‌ట‌. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ (Battery Electric Vehicle (BEV) ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాహనాల వాటా 48 శాతానికి చేరుకుంటుంద‌ని పేర్కొంటున్నాయి. 2025లో 16 శాతంగా ఉన్న BEV మార్కెట్ షేర్‌కు చాలా గణనీయమైన వృద్ధి ఇది.మార్పున‌కు ప్రధాన కారణాలు ఏమిటి?ఈ మార్పు వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. BEVలకు పెరుగుతున్న డిమాండ్, ఆటోమొబైల్ కంపెనీల వ్యూహాత్మక మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహాలు, టెక్నాలజీ అభివృద్ధి త‌దిత‌ర అంశాలు దోహ‌ద‌ప‌డుతున్నాయి. వీటిని విపులంగా పరిశీలిస్తే ఆటోమొబైల్ పరిశ్రమలో వస్తున్న విప్లవాత్మక మార్పులు క‌నిపిస్తున్నాయి.Battery Electric Vehicle ఉత్పత్తి రంగంలో కొత...
Electrification : భారతీయ రైల్వే వందేళ్ల విద్యుదీక‌ర‌ణ వేడుక‌లు..

Electrification : భారతీయ రైల్వే వందేళ్ల విద్యుదీక‌ర‌ణ వేడుక‌లు..

Green Mobility
Indian railways Electrification : భారతీయ రైల్వే త్వరలో 100 సంవత్సరాల విద్యుదీకరణ వేడుక‌ల‌ను జరుపుకోనున్నాయి. ఇది ప ప‌ర్యావర‌ణ హిత‌మైన‌ రైలు వ్యవస్థ దిశ‌గా మార్చేందుకు రైల్వేలు ఫిబ్రవరి 3 (సోమవారం) మొట్ట‌మొదటి సారిగా విద్యుత్ తో న‌డిచే రైలును ప్రారంభించారు.భారతదేశ మొట్ట‌మొద‌టి 'ఎలక్ట్రిక్ రైలు' చరిత్ర..భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలువబడేది) ప్లాట్‌ఫారమ్ 2 నుంచి ఫిబ్రవరి 3, 1925న ముంబైలోని కుర్లా వరకు నడిచింది. మొట్టమొదటి భారతీయ రైలు 1853లో ఏప్రిల్ 16న ప్రారంభించబడిన 72 సంవత్సరాల తర్వాత రైల్వేలు విద్యుద్దీకరణ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టాయి. ,"మొదటి ఎలక్ట్రిక్ రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడిచింది. దీనిని విక్టోరియా టెర్మినస్ లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 నుంచి నుంచి కుర్లా వరకు ప్ర‌యాణిం...
Hydrogen Fuel Train : మన హైడ్రోజ‌న్ రైళ్లు ప్ర‌పంచంలోనే ఎందుకు ప్ర‌త్యేక‌మైన‌వి?

Hydrogen Fuel Train : మన హైడ్రోజ‌న్ రైళ్లు ప్ర‌పంచంలోనే ఎందుకు ప్ర‌త్యేక‌మైన‌వి?

Green Mobility
Green Hydrogen : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఇంధనం (Hydrogen Fuel Train)తో నడిచే రైలు ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంతో భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. మ‌న హైడ్రోజ‌న్ రైళ్లు పూర్తి స్వ‌దేశీ పరిజ్ఞానంతో త‌యారై అసాధారణమైన హార్స్‌పవర్ అవుట్‌పుట్ ను అందిస్తాయ‌ని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్-శక్తి (Hydrogen Energy) తో కూడిన రైళ్లను విజయవంతంగా త‌యారు చేశాయి. వీటి ఇంజిన్లు 500 నుంచి 600 హార్స్‌పవర్ రేంజ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి పూర్తి విరుద్ధంగా, ఇండియన్ రైల్వేస్ త‌యారు చేసిన‌ హైడ్రోజన్ ఇంజన్ సాటిలేని విధంగా 1,200 హార్స్‌పవర్‌ను అందిస్తుంది, ఈ కేట‌గిరీలో ఇదే అత్యంత శక్తివంతమైనది. ఈ సాంకేతిక పురోగతి స్థిరమైన ఆవిష్కరణలకు భారతదేశం నిబద్ధతను ప్రపంచ ప్రమాణాలను అధిగ...
Electric Vehicle Park : క‌ర్నూలులో 12,00 ఎక‌రాల్లో ఎల‌క్ట్రిక్ వెహికిల్ పార్క్‌..

Electric Vehicle Park : క‌ర్నూలులో 12,00 ఎక‌రాల్లో ఎల‌క్ట్రిక్ వెహికిల్ పార్క్‌..

Green Mobility
Electric Vehicle Park : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటుకానుంది. ఈ మేర‌కు ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో సాయికాంత్ వర్మ ఎంఓయూపై సంతకాలు చేశారు.ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని విశ్వప్రసాద్ అన్నారు. ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ దేశంలోని ప్రైవేట్ EV పార్కుల కోసం బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. ఈ ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ తయారీ, ఆవిష్కరణ, ఉపాధికి అవకాశాలను సృష్ట...
Bharat Mobility Global Expo 2025 : EV అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరిగే అవ‌కాశం

Bharat Mobility Global Expo 2025 : EV అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరిగే అవ‌కాశం

Green Mobility
ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టండి : పీఎం మోదీBharat Mobility Global Expo 2025 : ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు, ఈ బూమ్ ప్రపంచ, దేశీయ తయారీదారులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని ఆయ‌న‌ ఆశాభావం వ్యక్తం చేశారు.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు, ఈ ఏడాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటో రంగ ఎక్స్‌పో (Bharat Mobility Global Expo) . “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” వ్యూహాన్ని అనుసరించాలని ప్ర‌ధాని మోదీ పెట్టుబడిదారులను కోరారు.మొబిలిటీ రంగంలో వృద్ధి సాధించాలని కలలు కంటున్న పెట్టుబడిదారులకు భారతదేశం మంచి గమ్యస్థానమని, ప్రభుత్వం మీ వెంటే ఉందన్నారు. ఎక్స్‌పోలో ఆటోమొబైల్స్, కాంపోనెంట్ ఉత్పత్తులు, సాంకేతికతలకు...
Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఈ-బస్సులు

Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఈ-బస్సులు

Green Mobility
Hyderabad : హైద‌రాబాద్‌లో వాయు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు TGSRTC ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇందులోభాగంగా భాగ్యనగరంలో డీజిల్ బ‌స్సుల స్థానంలో ద‌శ‌ల‌వారీగా ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను తీసుకొస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు TGSRTC ఇప్ప‌టివ‌ర‌కు 1389 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో 822 బస్సులు మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకానికి కేటాయించింది .కొత్త‌గా 353 ఎల‌క్ట్రిక్ బ‌స్సులుమార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్ల‌గొండ, సూర్యాపేటలలో 446 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 116.13 కోట్ల ఉచితంగా ప్ర‌యాణించార‌ని, దీని ద్వారా కార్పొరేషన్‌కు రూ.3,...
Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
Green Mobility | హైదరాబాద్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్‌ఆర్‌ (ORR) పరిధిలో కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి తొలిసారి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు (AMVI) నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గడిచిన పది నెలల్లో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు.మూసీ పునరుజ్జీవం అందరి బాధ్యతనగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ (Musi) పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబా...
వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
New Electric Buses: వరంగల్ రీజియన్‌లో టీజీఎస్ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో కొత్తగా 82 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.ఎలక్ట్రిక్ బస్సుల్లో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) ఉన్నాయి. ఢిల్లీకి చెందిన JBM కంపెనీ ఈ బస్సులను కాంట్రాక్ట్ (Gross cost contract) ప్రాతిపదికన నడపడానికి అంగీకరించింది. గ్రేటర్ వరంగల్ రీజియన్ పరిధిలోని బస్సులను నిర్వహిస్తున్న వరంగల్-2 డిపోలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 41 సీటింగ్ సామర్థ్యం, ​​డీలక్స్‌లో 2+2 సీటింగ్ ప్యాటర్న్‌లో 45 సీట్లు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 2+3 సీటింగ్ ప్యాటర్న్‌లో 55 సీట్లు ఉంటాయని, ముందు, వెనుక ఎయిర్ సస్పెన్షన్ ఉంటుందని అధికారులు తెలిపారు....
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..