
PM e-Bus Sewa ప్రారంభం: ఒకేసారి 200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధాని మోదీ!
గౌహతి : దేశంలో పర్యావరణ హితమైన గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఈ-బస్ సేవా (PM e-Bus Sewa) పథకం మరో కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం అస్సాంలోని గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకేసారి 200 JBM ఎకోలైఫ్ ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.ఏ నగరానికి ఎన్ని బస్సులు?ఈ విడతలో మొత్తం 200 బస్సులను మూడు ప్రధాన నగరాలకు పంపిణీ చేశారు. గౌహతి (అస్సాం)లో 100 బస్సులు, భావ్నగర్ (గుజరాత్)లో 50 బస్సులు, నాగ్పూర్ (మహారాష్ట్ర): 50 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో భారతదేశంలో JBM ఆటో సంస్థకు చెందిన మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 3,200 మార్కును దాటింది.PM e-Bus Sewa : అత్యాధునిక సౌకర్యాలతో 'ఎకోలైఫ్' బస్సులుఈ 9 మీటర్ల లో-ఫ్లోర్ బస్సులను ప్రయాణికుల పూర్తి రక్షణతోపాటు అనేక సౌకర్యాలతో కూడిన అంతర్జా...

