
Narmetta Oil Palm Factory | నర్మెట్టలో రూ.300 కోట్లతో భారీ ఆయిల్పామ్ ఫ్యాక్టరీ.. ఈనెల 22న ప్రారంభం!
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ (Narmetta Oil Palm Factory) ప్రారంభానికి సిద్ధమైంది. శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి ఫ్యాక్టరీని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈనెల 22న ప్రారంభోత్సవం - రూ.40 కోట్లతో రిఫైనరీకి శంకుస్థాపనఫ్యాక్టరీ పరిశీలన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వివరాలు వెల్లడించారు. ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్యాక్టరీ (Narmetta Oil Palm Factory) ని ప్రారంభిస్తారు. అదే రోజు రూ.40 కోట్లతో ఆయిల్ రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే తీసేవారని, ఇకపై రిఫైనింగ్ కూడా ఇక్కడే జరుగుతుందని మంత్రి ...

