
Sundarbans Mangrove plantation | ‘గ్రీన్’ విప్లవం – కేసీఆర్ జన్మదినం సందర్భంగా 10 వేల మడ మొక్కల పెంపకం !
కోల్కతా/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని (ఫిబ్రవరి 17), ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతమైన సుందర్ బన్ (Sundarbans) అడవుల్లో 10 వేల మడ మొక్కలను (Sundarbans Mangrove plantation) నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల పరీవాహక ప్రాంతంలోని ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కాపాడడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం.సుందర్ బన్ అడవుల రక్షణే లక్ష్యం..ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సుందర్ బన్ ఒకటి.మడ అడవులు తీర ప్రాంతానికి 'గ్రీన్ ఆర్మ్' (Green Arm) లాంటివి. ఇవి సునామీలు, తుఫాన్ల తీ...


