
Rythu Bharosa | 22న నర్మెట్టలో ‘రైతు భరోసా’ విడుదల!
Rythu Bharosa Release Date : ప్రకృతి వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన సచివాలయంలో ప్రారంభించారు. ‘రైతునేస్తం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులతో నేరుగా ముచ్చటించి, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.61,125 ఎకరాల్లో ప్రకృతి సాగు.. రూ. 42 కోట్లతో ప్రణాళికప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ వ్యయంతో ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు.ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లలో సుమారు 61,125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఎంపిక చేసిన 61,125 మంది రైతులకు రైతు వేదికల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. వీరికి మార్కెటింగ్లో సాయపడేందుకు...

