Harithamithra Telugu News

Home EV Updates Electric vehicles ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

0
APSRTC Electric buses

ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన APSRTC
ఛార్జీల వివరాలు ఇవిగో..

APSRTC Electric buses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) కడప-తిరుమల మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. కడప డిపోలో బస్సు సర్వీసులను కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి వీటిని ప్రారంభించారు. అంతకుముదు ఎలక్ట్రిక్ బస్సులకు కడప డిపోలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 12 బస్సుల్లో ఆరు బస్సులు నాన్‌స్టాప్‌ సర్వీస్‌గా ఉంటాయి. బస్సులు ఉదయం 4.30 నుంచి రాత్రి 7.30 వరకు నడుస్తాయి. బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.340, పిల్లలకు రూ.260 గా నిర్ణయించారు.

రాష్ట్రంలోని అన్ని డిపోలు క్రమంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుకు మారనున్నాయి. మొదటి దశలో ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య 50, తిరుమల-రేణిగుంట విమానాశ్రయాల మధ్య 14, తిరుపతి-మాడ మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.

Previous articleదేశవ్యాప్తంగా MG Comet EV డీలర్‌షిప్‌లు
Next articleSimple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here