Bharat Mobility Global Expo 2025 : EV అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరిగే అవ‌కాశం

Bharat Mobility Global Expo 2025
Spread the love

ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టండి : పీఎం మోదీ

Bharat Mobility Global Expo 2025 : ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు, ఈ బూమ్ ప్రపంచ, దేశీయ తయారీదారులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని ఆయ‌న‌ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు, ఈ ఏడాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటో రంగ ఎక్స్‌పో (Bharat Mobility Global Expo) . “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” వ్యూహాన్ని అనుసరించాలని ప్ర‌ధాని మోదీ పెట్టుబడిదారులను కోరారు.

మొబిలిటీ రంగంలో వృద్ధి సాధించాలని కలలు కంటున్న పెట్టుబడిదారులకు భారతదేశం మంచి గమ్యస్థానమని, ప్రభుత్వం మీ వెంటే ఉందన్నారు. ఎక్స్‌పోలో ఆటోమొబైల్స్, కాంపోనెంట్ ఉత్పత్తులు, సాంకేతికతలకు సంబంధించి 100 కంటే ఎక్కువ కొత్త లాంచ్‌లు ఉంటాయని భావిస్తున్నారు. భారతీయ ఆటోమొబైల్ రంగం గత నాలుగేళ్లలో $36 బిలియన్ల విదేశీ పెట్టుబడులను పొందింది. ఈ మొత్తం మరింత పెరుగుతుందని అంచనా.

పెరుగుతున్న ఈవీ విక్ర‌యాలు

వినియోగదారుల‌ సెంటిమెంట్ నేపథ్యంలో తయారీదారుల నుంచి డీలర్‌లకు ఆటోమొబైల్ డెలివ‌రీలు గ‌త సంవత్సరంతో పోలిస్తే 2024లో 12 శాతం పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రకారం గత ఏడాది 25.5 మిలియన్ వాహనాలు అమ్ముడయ్యాయి.

పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles (EV) ) విక్రయాలతో పాటు ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ భారత ఎగుమతులను బలోపేతం చేశాయని మోదీ అన్నారు. “ప్రతి సంవత్సరం భారతదేశంలో విక్రయించే వాహనాల సంఖ్య కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. అందుకే, భవిష్యత్ చలనశీలత విషయానికి వస్తే, భారతదేశం చాలా ఆశలతో కనిపిస్తుంది.” భారతదేశంలో గత దశాబ్దంలో EV అమ్మకాలు 640 రెట్లు పెరిగాయి. 2014లో ఒక సంవత్సరం మొత్తం విక్రయించిన దానికంటే రెట్టింపు వాహనాలను ఒక రోజులో విక్రయిస్తోంది.

“ఎదుగుతున్న మధ్యతరగతి, వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలు భారతదేశంలో ఆటో రంగాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి.” దేశంలో ప్యాసింజర్ కార్ల పరిధిని ప్రధాన మంత్రి హైలైట్ చేశారు.
ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ విషయానికొస్తే మనం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నాం… ఒకప్పుడు భారతదేశంలో కార్లు కొనకపోవడానికి కారణం నాణ్యమైన రోడ్లు లేకపోవడమే. ఈ పరిస్థితి మారుతోంది. ప్రయాణ సౌలభ్యం భారతదేశం ప్రాధాన్యత… గతేడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11 వేల కోట్లకు పైగా కేటాయించాం.

ఇండస్ట్రీ లీడర్లు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, హ్యుందాయ్, JSW MG మోటార్స్ ఈ సంవత్సరం భారతదేశంలో అనేక రకాల EVలను పరిచయం చేయబోతున్నాయి. పరిశ్రమకు చెందిన ప్రముఖులు టాటా గ్రూప్ రతన్ టాటా, సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకీలను గుర్తు చేసుకుంటూ, “భారత ఆటో రంగ వృద్ధికి, మధ్యతరగతి కలను నెరవేర్చడంలో వారిద్దరూ భారీ సహకారం అందించారు… నాకు నమ్మకం ఉంది. రతన్ టాటా, ఒసాము సుజుకీ వారసత్వం మొబిలిటీ రంగానికి స్ఫూర్తినిస్తుంది. అని మోదీ పేర్కొన్నారు.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *