PM e-Bus Sewa ప్రారంభం: ఒకేసారి 200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధాని మోదీ!

PM e-Bus Sewa ప్రారంభం: ఒకేసారి 200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధాని మోదీ!

గౌహతి : దేశంలో పర్యావరణ హితమైన గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఈ-బస్ సేవా (PM e-Bus Sewa) పథకం మరో కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం అస్సాంలోని గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకేసారి 200 JBM ఎకోలైఫ్ ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

ఏ నగరానికి ఎన్ని బస్సులు?

ఈ విడతలో మొత్తం 200 బస్సులను మూడు ప్రధాన నగరాలకు పంపిణీ చేశారు. గౌహతి (అస్సాం)లో 100 బస్సులు, భావ్‌నగర్ (గుజరాత్)లో 50 బస్సులు, నాగ్‌పూర్ (మహారాష్ట్ర): 50 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో భారతదేశంలో JBM ఆటో సంస్థకు చెందిన మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 3,200 మార్కును దాటింది.

PM e-Bus Sewa : అత్యాధునిక సౌకర్యాలతో ‘ఎకోలైఫ్’ బస్సులు

ఈ 9 మీటర్ల లో-ఫ్లోర్ బస్సులను ప్రయాణికుల పూర్తి రక్షణతోపాటు అనేక సౌకర్యాలతో కూడిన అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించారు. లోపల CCTV కెమెరాలు, ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయి.

ఫుల్​ ఎయిర్ కండిషన్డ్ (AC) తో పాటు సీనియర్ సిటిజన్లు, వైకల్యాలున్న వారికి ప్రత్యేక యాక్సెసిబిలిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవి పూర్తిగా కరెంట్ తోనే నడుస్తాయి కాబట్టి నగరాల్లో కర్బన ఉద్గారాలను భారీగా తగ్గిస్తాయి.

“మన దేశం గ్రీన్ మొబిలిటీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం వల్లనే ఈ మార్పు సాధ్యమైందని JBM ఆటో వైస్ చైర్మన్ & MD, నిశాంత్ ఆర్య అన్నారు.
JBM ఆటో గణాంకాల ప్రకారం, వారి ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటివరకు 300 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. 100 కోట్ల మందికి పైగా ప్రయాణికులను చేరవేసాయి. 100 కోట్ల కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలను నివారించాయి.

ముగింపు: 2070 నాటికి ‘నెట్-జీరో’ ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలనే భారత ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. గౌహతి వంటి నగరాల్లో పాత డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఈవీలు రావడం వల్ల కాలుష్యం తగ్గి, ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.


మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.  

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు