Harithamithra Telugu News

Home EV Updates గ్రామీణ మార్కెట్లే కీలకం.. ‘లీఫ్’ ఫోరమ్ ప్రారంభంలో కేంద్ర మంత్రి కుమారస్వామి – EV charging...

గ్రామీణ మార్కెట్లే కీలకం.. ‘లీఫ్’ ఫోరమ్ ప్రారంభంలో కేంద్ర మంత్రి కుమారస్వామి – EV charging ecosystem

0
EV charging ecosystem

EV charging ecosystem India | న్యూఢిల్లీ : భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన (EV) పరివర్తన కేవలం నగరాలకే పరిమితం కాకూడదని, అది సమ్మిళితంగా, ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి (HD Kumaraswamy) అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘లైట్ ఎలక్ట్రిక్-వెహికల్ యాక్సిలరేషన్ ఫోరమ్ (LEAF – Light Electric Vehicle Acceleration Forum)’ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

EV charging ecosystem : విశ్వసనీయత ముఖ్యం

ఈవీ రంగంలో భవిష్యత్తు సవాళ్లపై మంత్రి మాట్లాడుతూ, కేవలం మరిన్ని ఛార్జింగ్ పాయింట్లను పెంచడంపైనే కాకుండా, వాటిపై విశ్వసనీయత క‌లిగించ‌డంతోపాటు సులభంగా అందుబాటులో ఉండేటా చూసుకోవాల‌ని సూచించారు.

పరస్పర అనుసంధానం (Interoperability): ఛార్జింగ్ వ్యవస్థల (EV charging ecosystem) మధ్య అనుసంధానం ఉండాలని, అప్పుడే వినియోగదారులకు నిరంత‌ర‌ సేవలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అందుబాటు ధరలు: సామాన్యులకు అందుబాటు ధరలో వాహనాలను అందించడం, పరిశ్రమకు అది ఆచరణాత్మకంగా ఉండటంపై మన విధానాలు ఉండాలని స్పష్టం చేశారు.

ప్రపంచానికే దిక్సూచిగా భారత్

లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలే ప్రాథమిక రవాణా సాధనాలని, ఈ విభాగంలో తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను భారత్ అభివృద్ధి చేయగలిగితే.. ప్రపంచానికే నాయకత్వం వహించవచ్చని కుమారస్వామి అన్నారు.

“మనం ఇక్కడ సృష్టించే Scalable పరిష్కారాలను ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి వర్ధమాన మార్కెట్లకు ఎగుమతి చేయవచ్చు. ఇది భారతదేశానికి ఒక గొప్ప అవకాశం.” – హెచ్‌డి కుమారస్వామి

ఏమిటీ ‘లీఫ్’ (LEAF)?

  • ఎలక్ట్రిక్ ద్విచక్ర , త్రిచక్ర వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి పరిశ్రమల నేతృత్వంలో ఏర్పడిన ఒక తటస్థ కన్సార్టియం ఇది.
  • భాగస్వామ్య సంస్థలు: హీరో మోటోకార్ప్ (HeroMotoCorp) (ఎమర్జింగ్ మొబిలిటీ యూనిట్), ఏథర్ ఎనర్జీ, ఐపెక్ ఇండియా (I-PACE India) సంయుక్తంగా దీనిని ముందుకు నడిపిస్తున్నాయి.
  • లక్ష్యం: దేశవ్యాప్తంగా నిరాటంకమైన ఛార్జింగ్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ ఈవీ హబ్‌గా మార్చడం.

ఈ కార్యక్రమంలో లీఫ్ వ్యవస్థాపక సభ్యులు కౌసల్య నందకుమార్ (హీరో మోటోకార్ప్), రవ్‌నీత్ ఎస్ ఫోకెలా (ఏథర్ ఎనర్జీ), జోహ్రా ఖాన్ (ఐపెక్ ఇండియా) పాల్గొని, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Previous articleగ్రీన్ హీరోస్ 4: రోజుకో మొక్కతో అందరి దృష్టిని ఆకర్షించిన మొక్కల రాజశేఖర్ కథ
Next articlePM Surya Ghar Muft Bijli Yojana : 26 లక్షల ఇళ్లకు సోలార్ పవర్.. ఏపీ, తెలంగాణ స్థానాలు ఎక్కడ?
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here