PM E-Drive Scheme Budget 2026

బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? సబ్సిడీలపై కేంద్రం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు!

Spread the love

PM E-Drive Scheme Budget 2026 : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎల‌క్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కేంద్ర బడ్జెట్ 2026లో వినియోగదారులకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ వచ్చాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘PM E-డ్రైవ్’ పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు, గడువుపై తాజాగా స్పష్టత వచ్చింది.

ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే:

  1. PM E-Drive పథకానికి రూ.1,500 కోట్లు

2026-27 (FY27) ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్‌ కోసం రూ.1,500 కోట్లు కేటాయించింది. గత సంవ‌త్స‌రం సవరించిన బడ్జెట్ (రూ.1,300 కోట్లు) కంటే ఇది కొంత ఎక్కువ. దీనివల్ల మరిన్ని వాహనాలకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. ఇది కొనుగోలుదారుల‌కు శుభ‌వార్తే..

  1. టూవీలర్, త్రీవీలర్ సబ్సిడీలకు గడువు!

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (E-Bikes), త్రిచక్ర వాహనాలు (E-Autos) కొనే వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీలు మార్చి 31, 2026 నాటికి ముగియనున్నాయి. అంటే, మీరు సబ్సిడీ ప్రయోజనం పొందాలంటే ఈలోపే వాహనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వీటిని దశలవారీగా తొలగించాలని నిర్ణయించింది.

  1. ట్రక్కులు, బస్సులకు 2028 వరకు ఛాన్స్
    టూవీలర్లకు సబ్సిడీ ముగిసినా, ఎలక్ట్రిక్ ట్రక్కులు, బస్సులు, అంబులెన్స్‌లకు మాత్రం ప్రోత్సాహకాలు మార్చి 2028 వరకు కొనసాగుతాయి. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో భారీ వాహనాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోంది.
  2. ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం రూ.2,000 కోట్లు
    మీ గ్రామం, లేదా ప‌ట్ణ‌ణం లేదా హైవేలపై ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఉందా? అయితే ఇది మీకు శుభవార్తే! దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 22,100 ఫాస్ట్ ఛార్జర్లు (కార్ల కోసం), 48,400 ఛార్జర్లు (టూవీలర్ల కోసం) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సబ్సిడీ పొందిన వాహనాల లెక్కలివే..

    గత అక్టోబర్ 2024లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందారు:
    ఇప్పటివరకు 21.24 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది.
    ఎలక్ట్రిక్ ఆటోల (L5 Category) లక్ష్యం ఇప్పటికే పూర్తవ్వడంతో వాటికి సబ్సిడీలు నిలిపివేశారు.

    ముగింపు :

    మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తుంటే, మార్చి 2026 లోపు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఛార్జింగ్ స్టేషన్లు పెరగనున్నాయి. దీనివల్ల ఈవీ ప్రయాణం మరింత సులభతరం కానుంది.

    Harithamithra

    👉 “Eco friendly & environmental news updates for Free”

    వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

    We don’t spam! Read our privacy policy for more info.

    More From Author

    Global Solar Expo Hyderabad 2026

    హైదరాబాద్‌లో గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో 2026: ఫిబ్రవరి 6 నుండి హైటెక్స్‌లో మెగా ఈవెంట్.. పూర్తి వివరాలు!

    Bharat Vistar AI Agriculture

    Bharat Vistar AI : రైతులకు ‘భారత్ విస్తార్’ వ్యవసాయంలో AI విప్లవం.. పశుపోషణ, మత్స్య రంగానికి భారీ ఊతం!

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *