Harithamithra Telugu News

Friday, February 27Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Ap News

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Solar Energy
Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను ఏర్పాటు చేాయలని సూచించారు. సోలార్ కంపెనీల నుంచి వారంటీలతో కూడిన అధిక-నాణ్యత గల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె సోలార్ పవర్ యూనిట్లకు సబ్సిడీలు అందించే ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం (మఫ్ట్ బిజిలీ యోజన) Pradhan Mantri Surya...
Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్క‌లు నాటిన వారికి ఇక‌పై అవార్డులు..

Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్క‌లు నాటిన వారికి ఇక‌పై అవార్డులు..

General News
VIJAYAWADA : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ సంవ‌త్స‌రం కోటి మొక్క‌ల‌ను నాటి సంర‌క్షిస్తామ‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టం చేశారు. వన మహోత్సవాన్ని (Vanamahotsavam-2024) పురస్కరించుకుని మంగళగిరిలోని ఎకో పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఏపీకి 50% పచ్చదనం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటాలని, అదే సమయంలో ఉన్న చెట్లను సైతం కాపాడడం మ‌రిచిపోవ‌ద్ద‌ని ప్రజలకు సూచించారు. హరితాంధ్ర కోసం పాటుపడదాం, మొక్కలు నాటండి అనే నినాదంతో వనమహోత్సవం-2024 కింద రాష్ట్రానికి 50 శాతం పచ్చదనం వచ్చేలా మీరందరూ బాధ్యత వహించాలని అన్నారు. వనమహోత్సవం (Vanamahotsavam-2024)లో పాల్గొన్న చిన్నారుల నుంచి సీఎం ప్రతిజ్ఞ చేయించారు. ‘‘మా పిల్లల భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యం. అందరం హరిత యజ్ఞంలో పాలుపంచుకుందాం.” ప్రతి ఇంటి ఆవరణ...
ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

Electric vehicles
ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన APSRTC ఛార్జీల వివరాలు ఇవిగో.. APSRTC Electric buses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) కడప-తిరుమల మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. కడప డిపోలో బస్సు సర్వీసులను కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి వీటిని ప్రారంభించారు. అంతకుముదు ఎలక్ట్రిక్ బస్సులకు కడప డిపోలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 12 బస్సుల్లో ఆరు బస్సులు నాన్‌స్టాప్‌ సర్వీస్‌గా ఉంటాయి. బస్సులు ఉదయం 4.30 నుంచి రాత్రి 7.30 వరకు నడుస్తాయి. బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.340, పిల్లలకు రూ.260 గా నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని డిపోలు క్రమంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుకు మారనున్నాయి. మొదటి దశలో ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య 50, తిరుమల-రేణిగుంట విమానాశ్రయాల మధ్య 14, తిరుపతి-మాడ మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి....
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates