eBikeGo … లక్ష స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
దేశంలోని ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్ఫామ్లలో ఒకటైన eBikeGo త్వరలో లక్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతండడంతో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై అందరూ మొగ్గు చూపుతున్నారు.ఇటీవల వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఇప్పటికీ సప్రదాయ పెట్రోల్ కంటే ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం సరిపడా EV చార్జింగ్ స్టేషన్ల సదుపాయం లేదు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో EV వ్యవస్థను అభివృద్ధి చేయడానికి eBikeGo సంస్థ దేశంలోని ఏడు నగరాల్లో ఒక లక్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షించదగిన విషయం.eBikeGo భారతదేశంలో...