
జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం
రైతులకు 1.31 లక్షల యంత్రాలు..మంత్రి తుమ్మల కీలక ప్రకటన!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో నిలిచిపోయిన రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రైతు యాంత్రీకరణకు సర్వం సిద్ధంగత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన యాంత్రీకరణ పథకాన్ని (Farm mechanization scheme) ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను అందించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, జనవరి మొ...


