
గిరిజన రైతులకు శుభవార్త: అటవీ ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ – MSP for Tribal Farmers
MSP for Tribal Farmers | తెలంగాణలోని గిరిజన రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. అడవిలో వారు సేకరించే చిన్న అటవీ ఉత్పత్తులకు (MFP) సరైన ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక అడుగు పడింది. సోమవారం (మార్చి 9, 2026) న్యూఢిల్లీలో ట్రైఫెడ్ (TRIFED), తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (TGCC) మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఒప్పందం ముఖ్యాంశాలు:
- కనీస మద్దతు ధర (MSP): అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP for Tribal Farmers) కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. గిరిజన రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుంది.
- అమలు సంస్థలు: కేంద్ర స్థాయిలో ‘ట్రైఫెడ్’ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుండగా, రాష్ట్ర స్థాయిలో ‘తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్’ (TGCC) ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తుంది.
- సంతకాలు: ఈ ఒప్పందంపై TGCC మేనేజింగ్ డైరెక్టర్ సబ్యసాచి ఘోష్ (IAS), ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. రాజమురుగన్ (IPS) సంతకాలు చేశారు.
మౌలిక సదుపాయాల కల్పన:
ఈ ఒప్పందంలో భాగంగా కేవలం ధర కల్పించడమే కాకుండా, ఉత్పత్తుల నిల్వ, విక్రయాల కోసం ఐటిడిఏ (ITDA)ల పరిధిలో భారీ ఏర్పాట్లు చేయనున్నారు:
- గోడౌన్ల నిర్మాణం: సేకరించిన ఉత్పత్తులు పాడవకుండా ఉండేందుకు శాస్త్రీయమైన గోడౌన్లను నిర్మిస్తారు.
- హాత్ బజార్ల ఏర్పాటు: గిరిజన రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన హాత్ బజార్లను అభివృద్ధి చేస్తారు.
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వేలాది గిరిజన కుటుంబాలు అటవీ ఉత్పత్తుల సేకరణపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా వారికి స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, గిరిజన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది.
🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!
Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.
♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు



