హరితమిత్ర, వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు.
సెలవుల వివరాలు:
మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి:
- ఫిబ్రవరి 14, 2026 (శనివారం): వారాంతపు యార్డు బంద్.
- ఫిబ్రవరి 15, 2026 (ఆదివారం): వారాంతపు సెలవు, మహా శివరాత్రి పండుగ.
- ఫిబ్రవరి 16, 2026 (సోమవారం): శివరాత్రి మరుసటి రోజు జాగరణ సందర్భంగా మార్కెట్కు సెలవు
- ఫిబ్రవరి 17, 2026 (మంగళవారం): అమావాస్య కారణంగా మార్కెట్కు బంద్.
వరుసగా నాలుగు రోజుల సెలవుల అనంతరం, మార్కెట్ యార్డు తిరిగి ఫిబ్రవరి 18, 2026 (బుధవారం) రోజున యథావిధిగా ప్రారంభమవుతుంది. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి, పైన పేర్కొన్న బంద్ రోజులలో తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించి ఇబ్బందులకు గురికావద్దని మార్కెట్ కమిటీ కార్యదర్శి కోరారు. బుధవారం నుంచి విక్రయాల కోసం రైతులు తమ సరుకును తీసుకురావచ్చని తెలిపారు.



