Friday, March 14Lend a hand to save the Planet
Shadow

Park+ నేతృత్వంలో Carbon Se Azadi Mahotsav

Spread the love

దేశ‌వ్యాప్తంగా 10,000 EV జోన్‌ల ఏర్పాటు

EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన‌ పార్క్+ (Park+ ) తన ‘కార్బన్ సే ఆజాది’ మహోత్సవ్ 2022 (Carbon Se Azadi Mahotsav) వేడుకను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB)తో ఒప్పందం కుదుర్చుకుంది.

పార్క్+ ఈ ఒప్పందం ద్వారా దాని భాగస్వాములు, కస్టమర్ల కోసం EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

సారూప్యత కలిగిన EVసంస్థ‌ల భాగస్వామ్యంతో EV జోన్‌లను ఏర్పాటు చేయడానికి తమ బిడ్‌లో 600 కంటే ఎక్కువ ఆస్తులను కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది గత ఐదు నెలల్లో 1000+ EV జోన్‌లను అమలు చేసింది. ప్రతిరోజూ సగటున మూడు EV జోన్‌లు యాక్టివేట్ చేయబడ్డాయి.

Carbon Se Azadi Mahotsav

పార్క్+ వ్యవస్థాపకుడు & CEO అమిత్ లఖోటియా మాట్లాడుతూ “బలమైన EV ఛార్జింగ్ నెట్‌వర్క్ లేకుండా భారతీయ EV కథనం అసంపూర్ణంగా ఉంటుంది. బలహీనమైన EV ఛార్జ్ నెట్‌వర్క్ EV కార్ ఓనర్‌లలో రేంజ్ విష‌యంలోఆందోళనను పెంచుతుంది. అదనంగా సాధార‌ణ ఇంధ‌న కార్ల యజమానులలో EV స్వీకరణ విషయానికి వస్తే బలహీనమైన EV ఛార్జర్ నెట్‌వర్క్ కూడా ప్రధాన అవరోధంగా ఉంటుంద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..