Harithamithra Telugu News

Sunday, February 22Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Solar Energy

Solar power
New Solar power Plants
90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది

90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది

Solar Energy
Omkareshwar Floating Solar Project  | మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో వేల కోట్ల రూపాయలతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించ‌డంతోఅభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. చారిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్, దౌధాన్ డ్యామ్, ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరిగిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలిపారు.జాతీయ దృక్పథ ప్రణాళిక కింద దేశంలో మొట్టమొదటి నదుల అనుసంధానం ప్రాజెక్టు అయిన కెన్-బెత్వా నదిని అనుసంధానించే జాతీయ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ మధ్యప...
New Solar power Plants | రైతులకు అదనపు అదాయం వచ్చేలా సర్కారు కీలక నిర్ణయం

New Solar power Plants | రైతులకు అదనపు అదాయం వచ్చేలా సర్కారు కీలక నిర్ణయం

Solar Energy
New Solar power Plants in Telangana : రాష్ట్రంలో పాడుబడిన వ్యవసాయ భూములు, సాగులో లేని భూములలో రైతులకు అదనపు ఆదాయం అందించేందుకు త్వరలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్-A పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (PM- Kusum) కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.రైతులకు అదనపు ఆదాయంఈ పథకం కింద ఎండిపోయిన లేదా పాడుబడిన వ్యవసాయ భూములలో 0.5 మెగావాట్ల నుంచి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోలార్ ప్ల...
Solar Energy | రికార్డు స్థాయికి భారతదేశ సౌర ఉత్పత్తి ఎగుమతులు.. రెండేళ్లలో 20 రెట్లు జంప్

Solar Energy | రికార్డు స్థాయికి భారతదేశ సౌర ఉత్పత్తి ఎగుమతులు.. రెండేళ్లలో 20 రెట్లు జంప్

Solar Energy
Solar Energy | సోలార్ ఉత్ప‌త్తుల్లో భార‌త్ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఒక తాజా నివేదిక ప్రకారం.. భారతదేశ సోలార్ ఫోటోవోల్టాయిక్ (Solar Photovoltaic (PV) ఉత్పత్తుల ఎగుమతులు FY22 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం (FY)లో 23 రెట్లు పెరిగి $2 బిలియన్లకు చేరుకున్నాయని తేలింది.ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (IEEFA), JMK రీసెర్చ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, నికర దిగుమతిదారు నుంచి సౌర ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా భారతదేశం మారింది. తాజాగా ఇతర దేశాలు ఇప్పుడు తమ "చైనా ప్లస్ వన్" వ్యూహానికి భారతదేశాన్ని అత్యుత్త‌మ‌ ఎంపికగా భావిస్తున్నారు. దేశీయ PV తయారీదారులు తమ ఉత్పత్తులను విదేశాలలో అధిక ప్రీమియంతో విక్రయించాలని చూస్తున్నారు.మార్కెట్ల పరంగా, భారతీయ సోలార్ సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV ఎగుమతులకు యుఎస్ కీలక మార్కెట్‌గా అవతరించింది. FY2023 మరియు FY2024 రెండింటిలోనూ భారతీయ సోలా...
ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Solar Energy
Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను ఏర్పాటు చేాయలని సూచించారు. సోలార్ కంపెనీల నుంచి వారంటీలతో కూడిన అధిక-నాణ్యత గల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె సోలార్ పవర్ యూనిట్లకు సబ్సిడీలు అందించే ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం (మఫ్ట్ బిజిలీ యోజన) Pradhan Mantri Surya...
Green Energy | రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీకి ప్రణాళికలు..

Green Energy | రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీకి ప్రణాళికలు..

Solar Energy
Green Energy in Telangana | రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని,  భవిష్య‌త్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2029-2030 వరకు  20,000 మెగా వాట్ల వరకు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక లను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti Vikramarka Mallu ) తెలిపారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీంతో విద్యుత్ వినియోగం  పెరుగుతున్నందున విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల‌ని అన్నారు.  అందుకు కావాల్సిన బడ్జెట్‌తో ముందుకు పోతున్నామని భట్టివిక్రమార్క తెలిపారు. ట్రాన్స్‌ఫార్మ‌ర్ల‌పై లోడ్ పడకుండా కావాల్సిన అదనంగా ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌ను  అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి  రైతులకు పంటతో పాటు కరెంటుతో ఆదాయం వచ్చేలా వ్యవసాయ పంపు స...
Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..

Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..

E-scooters, Solar Energy
Solar news | సుస్థిర ఇంధన విధానాలు, సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక చేశారు. టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, తెలంగాణ స్టేట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీ ఆర్‌ఈడీసీఓ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల వావిళ్ల, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సురేందర్‌తో కలిసి గ్రామాన్ని ఇటీవల సందర్శించారు.ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామస్థులతో కలిసి వివరించారు. గ్రామంలో 1,039 మంది గృహ వినియోగదారులు, 520 మంది  వ్యవసాయ వినియోగదారులు (రైతులు) ఉన్నారు. కాగా గృహ వినియోగదారులకు సంబంధించి సర్వే పూర్తయింది. ఇప్పటివరకు దాదాపు 50 శాతం వ్యవసాయానికి సంబంధించి విద్యత్ వినియోగంపై  సర్వే చేశారు. మిగిలినవి వచ్చే మూడు రోజుల్లో పూర...
Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Solar Energy
Renewable Energy : గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాముల‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్ర‌దాయ‌ విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని వెల్ల‌డించారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు.పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy) లో భారత్‌ ప్రపంచానికి రోల్‌మాడ‌ల్‌గా నిల‌వ‌నుంద‌ని మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం సుమారు 208 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధనాన్ని మ‌న‌దేశం ఉత్పత్తి చేస...
పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

Solar Energy
PM Rooftop Solar Scheme | ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో సోమ‌వారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పూర్తయింద‌ని, వారు ప్ర‌స్తుతం ఉచితంగా సోలార్ విద్యుత్ ను వినియోగించుకుంటున్నార‌ని, పేద‌ల ప్ర‌జ‌ల‌పై క‌రెంటు బిల్లుల భారం త‌గ్గిపోయింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.PM Rooftop Solar Scheme ద్వారా త‌మ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న‌ వినియోగదారులు తమకు అవ‌స‌ర‌మైన‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్‌...
Bhatti Vikramarka |  సోలార్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం..

Bhatti Vikramarka | సోలార్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం..

Solar Energy
Solar Power | తెలంగాణ రాష్ట్రం 2035 నాటికి 40 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన గ్రీన్ పవర్ ఎనర్జీ పెట్టుబడిదారుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సదంర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సోలార్ రంగం (Solar Power )లో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని, హైదరాబాద్ లో అన్ని అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సమగ్ర ఇంధన విధానాన్ని అభివృద్ధి చేస్తోందని చెప్పారు.పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం స్థిరత్వానికి మార్గమని తెలిపారు. తెలంగాణలో ఆర్టిఫిష...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates