
Nizamabad | పసుపు రైతులకు గుడ్ న్యూస్: తడిసినా సరే.. కోతలు లేకుండా కొనుగోలు చేయాలి!
Nizamabad Turmeric Market news | అకాల వర్షాలతో నష్టపోయిన పసుపు రైతులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుల్లో పసుపు కొనుగోళ్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తేమ పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు
వర్షాల కారణంగా తడిసిన పసుపును ఎలాంటి కోతలు లేకుండా, పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. “తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు. నిబంధనల పేరుతో రైతులను వేధించే మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.
Nizamabad మార్కెట్లో భారీగా పసుపు రాక
నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు పంట భారీగా వస్తోందని మంత్రి తెలిపారు.
- ప్రస్తుతం యార్డులో 27,400 బస్తాల (4,500 కుప్పలు) పసుపు నిల్వ ఉంది.
- మరో 500 కుప్పలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి.
- అకాల గాలులు, వర్షాల వల్ల సుమారు 70 నుండి 80 కుప్పలు తడిశాయని, దీనివల్ల 40 మంది రైతులకు నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.
టార్పాలిన్ల పంపిణీకి సిద్ధం
పంటను వర్షాల నుండి రక్షించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. 1,500 టార్పాలిన్ల పంపిణీ కోసం ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిందని, రైతులకు ఇబ్బంది కలగకుండా వీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
మేలు రకం పసుపు పంటకు ప్రభుత్వం ఖరారు చేసిన ధరను సక్రమంగా చెల్లించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. అన్నదాతలకు చెల్లింపుల విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు.
🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!
Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.
♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు



