Harithamithra Telugu News

Home EV Updates E-scooters హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

0
ola sells 35000 escooter

దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers

ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా  ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది.

ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ లో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్ లోని ఆదర్శ్ నగర్ లో అలాగే మెహదీపట్నంలో రేతిబౌలిలో  Ola experience centers ను ప్రారంభించింది. దీంతో, హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరింది.

ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “ వాహనాల కొనుగోలు ప్రక్రియ ను మరింత సులభతరం చేసేందుకు , మేము దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మా ఆఫ్‌లైన్ ఉనికిని దూకుడుగా విస్తరిస్తున్నాము. మేము మా ఆఫ్‌లైన్ సెంటర్స్ ను విస్తరించే చర్యలను వేగవంతం  చేయవలసిన అవసరం ఉందని మేము విశ్వసిస్తున్నాము. దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న లక్షలాది భారతీయులు మా ఉత్పత్తులు, సేవలను సజావుగా అందించడానికి వీలు కల్పిస్తాము’’ అని వివరించారు.

ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు  వినియోగదారులకు ఒకే ప్రదేశంలో సమగ్రమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. దాదాపు 90% మంది ఓలా వినియోగదారులు ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు S1, S1 ప్రో మోడళ్లను టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే, కొనుగోలు ప్రక్రియలో మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. వినియోగదారులు స్టోర్‌లలో ఫైనాన్సింగ్ ఆప్షన్స్ గురించిన సమాచారాన్ని పొందడంతో పాటు, ఓలా యాప్ ద్వారా తమ కొనుగోలు ప్రయాణాన్ని పూర్తి చేసుకోవచ్చు.

భారతదేశంలో 2025 నాటికి మొత్తం 2వీలర్లను ఎలక్ట్రిక్‌గా మార్చాలనే దృక్పథంతో ముందుకు సాగుతోంది., స్థిరమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ప్రపంచ మార్పును వేగవంతం చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోసం దృఢమైన ప్రణాళికను అమలు చేస్తోంది.


tech news

Previous articleTVS iQube Electric scooter కు భారీ డిమాండ్
Next articleబ‌జాజ్ ఎల‌క్ట్రిక్ ఆటో చూశారా?
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here