మూడు నెలల్లోనే 2.78లక్షల ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్
దేశంలో భారీగా పెరుగుతున్న విక్రయాలు
2-78 lakh evs registered : 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో భారతదేశంలో 2.78 లక్షల కంటే ఎక్కువ EVలు రిజిస్టర్ అయ్యాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021లో 3,29,808 నుండి 2022 నాటికి 10,20,679కి పెరిగింది. 2023 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు దేశంలో 2.78 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు.ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లు వాహన్ పోర్టల్కు మారే ప్రక్రియలో ఉన్నాయని, అందువల్ల EV రిజిస్ట్రేషన్పై వారి డేటా పాక్షికంగా చేర్చబడిందని, తెలంగాణ, లక్షద్వీప్ డేటా పోర్టల్లో అందుబాటులో లేదని గడ్కరీ లోక్సభకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.పోర్టల్లోని డేటా ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021ల...