
Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్లైన్
Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ, నకిలీ వ్యవసాయ ఇన్పుట్ల ఉత్పత్తి, అమ్మకాలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏవైనా అనుమానాస్పద ఉత్పత్తులను చూసినట్లయితే టోల్ ఫ్రీ హెల్ప్లైన్కు తెలియజేయాలని ఆయన కోరారు.రైతులకు మద్దతుగా, ప్రభుత్వం ఇప్పటికే ఒక హెల్ప్లైన్ నంబర్ను జారీ చేసింది, దీని ద్వారా వారు ఫిర్యాదులు చేయవచ్చు, అలాగే సహాయం పొందవచ్చు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ (Agriculture Ministry) శాఖ యొక్క అధికారిక X హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోలో ఒక పోస్టు షేర్ చేశారు. అందులో కేంద్ర మంత్రి శ...