రేపటి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement
Amaravathi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ (PaddyProcurement) కార్యకలాపాలు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతులు తమ వివరాలను వాట్సాప్ నంబర్ 73373 59375కు “HI” సందేశం పంపడం ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్య సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,000 రైతు సేవా కేంద్రాలు, దాదాపు 2,000 కొనుగోలు కేంద్రాలు…
