Juiy App | ఎలక్ట్రిక్ వాహనాలపై అపోహలు తొలగించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్..
జూయి యాప్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Juiy App | హైదరాబాద్ : సుస్థిర రవాణా దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడంలో వినియోగదారులకు అవసరమైన గైడెన్స్ ను అందించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ‘జూయి యాప్’ (Juiy App) ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సంప్రదాయ పెట్రోల్ వాహనాలతో పర్యావరణానికి హాని కలుగుతుంది. వాతావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. పెట్రోల్ వాహనాలు విడుదల చేసే కార్బన్ ఉద్గరాలతో వాతావరణ మార్పులను వేగవంతం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
కాగా జూయి యాప్ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. “ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ మన దేశ ప్రగతికి చోదక శక్తులు అని, పరివర్తనాత్మక చలనశీలత...