
Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతులకు సర్కారు గుడ్న్యూస్
కూరగాయల ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వ కీలక నిర్ణయంకొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు – రైతులకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీAgriculture subsidy : రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించి స్థానిక మార్కెట్లలో సరఫరా, ధరలను స్థిరంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూరగాయల రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేయనుంది.ప్రస్తుతం తెలంగాణలో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర అవసరాలు సుమారు 26 లక్షల టన్నులుగా ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ అంచనాల ప్రకారం 12.68 లక్షల టన్నుల లోటు ఉండటంతో, ఏటా 10 వేల ఎకరాల అదనపు సాగును ...

