
Kisan Diwas : రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ టాప్ 10 పథకాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు అందిస్తున్న సేవలను గౌరవిస్తూ, భారతదేశ 5వ ప్రధానమంత్రి, రైతు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడు చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న కిసాన్ దివస్ (Kisan Diwas 2025 - జాతీయ రైతు దినోత్సవం) ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భూ సంస్కరణలు అమలుచేయడంలో, రైతుల హక్కుల పరిరక్షణలో చరణ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ రోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.Kisan Diwas : ఈ ఏడాది థీమ్కిసాన్ దివస్ 2025 సందర్భంగా “విక్షిత్ భారత్ 2047 – భారత వ్యవసాయాన్ని ప్రపంచీకరించడంలో FPOల పాత్ర” అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రపంచ స్థాయిలో పోటీతత్వంగా మార్చడంపై ఈ ఏడాది ప్రత్య...

