నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు
కొత్తగూడెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు నేలకొరిగిన కొన్ని దశాబ్దాల నాటి రెండు చెట్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) తిరిగి నాటి వాటికి మళ్ళీ జీవం పోసింది.. కొత్తగూడెంలోని ఎస్సిసిఎల్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న ఆరు దశాబ్దాల నాటి పెద్ద మర్రిచెట్టు ఈదురు గాలులు, వర్షం కారణంగా నేలకూలింది. దీంతో కంపెనీ డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) ఎన్ బలరామ్, చెట్టును మరో చోటికి తరలించి నాటాలని సూచించడంతో నిపుణులు, సిబ్బంది రంగంలోకి…
