
Urea Shortage | మళ్లీ యూరియా కష్టాలు.. చలిలో అన్నదాతల పడిగాపులు!
Urea Shortage in Telangana | రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్ననేపథ్యంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల కొద్దీ తరబడి క్యూలో పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు, కర్రలు క్యూలో పెట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'.. రైతులకు వరమా? శాపమా?ఎరువుల పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్' రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. గతంలో నేరుగా గోదాములకు వెళ్లి డబ్బులు చెల్లించి ఎరువులు తెచ్చుకునే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సామాన్య రైతులు అయోమయానికి గురవుతున్నారు.సాంకేతిక సమస్యలు: యాప్ ప్రారంభించిన తొలిరోజునే మ...

