
సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వండి
Telangana : సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఏర్పడిన సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల పేర్కొన్న ప్రకారం, మోంథా తుఫాను, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిబంధనలలో ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మంత్రి తుమ్మల ప్రకారం రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు జరిగిందని, ఎకరాకు సగటు 7.62 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశారు. కానీ అకాల వర్షాల ప్రభావంతో గింజల నాణ్యత తగ్గి, FAQ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో రైతులు (Telangana Farmers ) ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో NAFED, NCCF సంస్థలు సడలించిన నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరపాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.మొక్కజొన్న రైతులకు MSP కింద రక్ష...









