Harithamithra Telugu News

Home EV Updates E-scooters ఢిల్లీలోకి పెట్రోల్, డీజిల్ వాహ‌నాల‌కు నో ఎంట్రీ

ఢిల్లీలోకి పెట్రోల్, డీజిల్ వాహ‌నాల‌కు నో ఎంట్రీ

0
  • సీఎన్‌జీ, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు అనుమ‌తి
  • air pollution నుంచి కాపాడేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం
  • న‌వంబ‌రు 27 డిసెంబ‌రు 3 వ‌కు అమ‌లు

కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న ఢిల్లీ న‌గ‌రాన్ని కాపాడేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు పెట్రోల్, డీజిల్ రవాణా వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. కేవ‌లం CNG, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమతి ఇచ్చింది.

దేశ‌ రాజధాని, న్యూఢిల్లీ ప్రాంతం కొన్ని వారాలుగా తీవ్రమైన వాయు కాలుష్యం(air pollution)తో పోరాడుతోంది. న్యూఢిల్లీలో కాలుష్య స్థాయి ఇప్పుడు దీపావళికి ముందు రోజుల మాదిరిగానే మెరుగైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)కి తగ్గుతోంది. కాబట్టి, దీనిని కొనసాగించడానికి నగరంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం.. అనేక చర్యలు చేపట్టింది. వాటిలో ఒకటి నవంబరు 27 నుంచి డిసెంబరు 3, 2021 వరకు ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది.

దేశ రాజధానిలో air pollution నియంత్రించడానికి స్టేక్‌హోల్డర్‌ల ఉన్నత స్థాయి సమావేశం తర్వాత మీడియా సమావేశంలో ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడారు. నవంబర్ 27 నుండి అత్య‌వ‌స‌రమైన సేవలలో నిమగ్నమైన వాటిని మినహాయించి నవంబర్ 27 నుంచి సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే, ఢిల్లీలో ప్రవేశించేందుకు అనుమతిస్తామ‌ని తెలిపారు. “మిగతా వాహనాలన్నీ డిసెంబర్ 3 వరకు నిషేధించబడతాయి. అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాలపై పూర్తి నిషేధం ఉంటుందని భావించారు. అయితే, ఇది ట్రక్కులు, టెంపోలు, ఇతర రవాణా వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, అన్ని వాహనాలకు కాదని“ మంత్రి విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి నవంబర్ 22 నుండి జాతీయ రాజధానిలోకి అనవసరమైన వస్తువులను తీసుకువెళ్లే భారీ వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని ఇప్పటికే నిషేధించింది. సాధారణ ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది ప్రజా రవాణాను ఉపయోగించాలని గోపాల్ రాయ్ కోరారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లే చోట తిమార్‌పూర్, గులాబీ బాగ్ వంటి ప్రధాన కాలనీలకు ప్రత్యేక CNG బస్సులను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. తాము ఉద్యోగుల కోసం ఢిల్లీ సెక్రటేరియట్ నుంచి ITO, ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్లకు షటిల్ బస్సు సర్వీసును ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు.

Previous articleత‌మిళ‌నాడులో అతిపెద్ద ఈవీ ఫ్యాక్ట‌రీ
Next articleరూ.36వేల‌కే Bounce Infinity electric scooter
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here