Harithamithra Telugu News

Home EV Updates E-scooters e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు

e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు

1
e-Ashwa-electric-rickshaw-launched

రేంజ్‌, స్పీడ్‌, ధ‌ర‌ల వివ‌రాలు ఇవిగో..

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న EV తయారీ ప‌రిశ్ర‌మ‌ల్లో e-Ashwa Automotive Private Limited ఒక‌టి.  తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఆటో విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఈ-ఆటో ధర రూ. 1,65,000/- (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర). లాస్ట్-మైల్ మొబిలిటీని సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా సరసమైనది, పర్యావరణ అనుకూలమైనదిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇ-ఆటో ప్రారంభంతో  EVలో ఉనికిని బలోపేతం చేయడానికి E-Ashwa  దాని ఎలక్ట్రిక్ 3-వీలర్ విభాగాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హెవీ స్టీల్ బాడీ ఇ-ఆటోలు లిథియం అయాన్ (3-4 గంటల ఛార్జింగ్ సమయం), లీడ్ యాసిడ్ బ్యాటరీలు (7-8 గంటల ఛార్జింగ్ సమయం) రెండింటిలోనూ రన్ అవుతాయి . ఈ వాహ‌నాలు స్కై బ్లూ, గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ అండ్ వైట్ వంటి విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటాయి. 90-100 కిమీల మైలేజీతో,  గరిష్టంగా 25 కిమీ వేగంతో ప్ర‌యాణిస్తాయి.

ఈ-ఆటో సెగ్మెంట్‌లోకి ప్రవేశించడం పట్ల సంతోషిస్తున్నట్లు ఇ-అశ్వ ఆటోమోటివ్ వ్యవస్థాపకుడు, సీఈవో వికాస్ గుప్తా తెలిపారు. “తాము లాస్ట్ మైల్ డెలివ‌రీ లో అంతరాలను తగ్గించేందుకు ఇ-ఆటోను తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలమైనదిగా మార్చాలనుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.  .

E-Ashwa  గత సంవత్సరం 12 రకాల ఎలక్ట్రిక్ 2-వీలర్లను విడుదల చేసింది. దాని స్వంత బ్రాండ్ ఇ-అశ్వ కింద కొన్ని ఎలక్ట్రిక్ 3-వీలర్ల మోడళ్లను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ 3-వీలర్ల కింద ఇ-అశ్వలో ప్యాసింజర్ 3-వీలర్లు, కార్గో 3-వీలర్లు ఉన్నాయి.

గత 4 సంవత్సరాలుగా e-Ashwa EV ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇప్పటి వరకు ఇ-స్కూటర్‌లు, ఇ-మోటార్‌బైక్‌లు, ఇ-రిక్షాలు, ఇ-ఆటో, ఇ-లోడర్లు, ఇ-ఫుడ్ కార్ట్ నుండి ఇ-గార్బేజ్ వెహికల్స్ వరకు వివిధ వర్గాల క్రింద 18,000 EV ఉత్పత్తులను విక్రయించింది. ఇది దేశవ్యాప్తంగా 950 కంటే ఎక్కువ డీలర్‌లతో బలమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌తో 16 రాష్ట్రాల్లో అసెంబ్లీ యూనిట్లను కలిగి ఉంది.

Previous articleవావ్… Smart Solar Hotel
Next articleEV sector లో 2030 నాటికి కోటి ప్ర‌త్య‌క్ష ఉద్యోగాలు
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here