ebikego

eBikeGo bike వస్తోంది..

Spread the love

ఆగస్టు 25న ఎల‌క్ట్రిక్ బైక్ లాంచ్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ ఎనర్జీ వన్  electric scooters లాంచ్ అయిన తర్వాత, ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ సంస్థ eBikeGo bike (ఈ బైక్ గో) ఈనెల 25న‌ స‌రికొత్త‌ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ బైక్ ప్రారంభించిన త‌ర్వాత మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చింది.  అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన వివ‌రాలేవీ eBikeGo వెల్ల‌డించ‌లేదు.  హై-స్పీడ్ ‘ఎలక్ట్రిక్ బైక్’ అని పేర్కొంది.  ఇది గంటకు 45 కిమీ కంటే ఎక్కువ వేగం ఉంటుద‌ని మ‌నం ఆశించ‌వ‌చ్చు.  మ‌రో మంచి విష‌య‌మేమంటే ఇది కేంద్ర ప్ర‌భుత్వం అందించే ఫేమ్-II సబ్సిడీకి ఈ బైక్‌కు వ‌ర్తిస్తుంది.

eBikeGo bike ఇండియాలోనే త‌యారీ

రగ్డ్ ఎల‌క్ట్రిక్ బైక్ పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేయబడిందని కంపెనీ ప్ర‌క‌టించింది.  దీనిని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) కూడా పరీక్షించి ఆమోదించింది.  ఇది 25 ఆగస్టు 2021 న విడుద‌ల చేయ‌నున్నారు.  పరిమిత ప్రీ-ఆర్డర్ ఆప్ష‌న్‌ను ఈబైక్‌గో వెబ్‌సైట్‌లో చూడొచ్చు.  ఈబైక్‌గో తన ఆల్-ఎలక్ట్రిక్ డెలివరీ నెట్‌వర్క్‌ను 2017 లో ప్రారంభించించింది.  అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూవీలర్ OEM లు, తయారీదారులు పెరిగే అవ‌కాశ‌ముంటుంద‌ని కంపెనీ అంచనా వేసింది.  అప్ప‌టి నుంచే ఇది ఈవీల త‌యారీపై దృష్టి కేంద్రీక‌రించింది.  దీని ధర కూడా అంద‌రికీ అందుబాటులోనే ఉంటుద‌ని కంపెనీ పేర్కొన్నారు.

eBikeGo వ్యవస్థాపకుడు & CEO ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారతదేశంలో అత్యంత స్థిరమైన, తెలివైన. బలమైన ఎలక్ట్రిక్ మోటార్-స్కూటర్ ‘రగ్డ్’ ను ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. ఇది భారతదేశంలో ఇ-మొబిలిటీమొబిలిటీ దిశ‌ను మార్చివేస్తుంద‌ని, ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ఆవిష్కరణ సరిహద్దులను దాటుతుంద‌ని అన్నారు.

More From Author

ather-ola-simple

Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?

One thought on “eBikeGo bike వస్తోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యానికి సవాలు న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబ‌ల్ ఇండెక్స్‌ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల...