Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Spread the love

Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

 

Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా ప్రారంభించింది. విక్రయించిన అన్ని ఎలక్ట్రిక్ మహీంద్రా 3-వీలర్లలో, ట్రియో శ్రేణి ఎంతో స‌క్సెస్ తోపాటు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. 2019 సంవత్సరపు ఎలక్ట్రిక్ 3-వీలర్, మేడ్-ఇన్-ఇండియా ఇన్నోవేషన్ కోసం ఆటో రిటైల్ మార్కెటింగ్‌లో గ్లోబల్ అవార్డ్స్ వ‌రించాయి.

ఈ విష‌య‌మై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) సీఈవో సుమన్ మిశ్రా మాట్లాడుతూ.. “ ఈ వర్గాన్ని నిర్మించడంలో మేము శక్తి వంచ‌న లేకుండా కృషి చేశాం. వాహ‌నాల విష‌య‌మై సంతృప్తితో ఉన్న కస్టమర్‌లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అని తెలిపారు.

ఈ ప్రయాణంలో 50000+ Mahindra Electric Three-Wheelers (ఎలక్ట్రిక్ 3-వీలర్) మైలురాయిని దాటడం గొప్ప‌విష‌యం. మేము 133 మిలియన్ల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కిలోమీటర్లను అధిగమించాం. 27,566 మెట్రిక్ టన్నుల CO₂ ఆదా చేశాం. లేకుంటే 6.1లక్షల కంటే ఎక్కువ చెట్లను నాటడం అవసరం అని సుమ‌న్ మిశ్రా తెలిపారు. ఇ ఆల్ఫా కోసం అపోలో సివి మ్యాగజైన్ నుండి గుర్తింపు అవార్డు, గ్రీన్ వెహికల్ ఎక్స్‌పో 3వ ఎడిషన్‌లో గ్రీన్ అచీవర్ 2022 అవార్డును కూడా గెలుచుకుంది అని పేర్కొన్నారు.

Tech newsTech news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..