గ్రామీణ మార్కెట్లే కీలకం.. ‘లీఫ్’ ఫోరమ్ ప్రారంభంలో కేంద్ర మంత్రి కుమారస్వామి – EV charging ecosystem

గ్రామీణ మార్కెట్లే కీలకం.. ‘లీఫ్’ ఫోరమ్ ప్రారంభంలో కేంద్ర మంత్రి కుమారస్వామి – EV charging ecosystem

EV charging ecosystem India | న్యూఢిల్లీ : భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన (EV) పరివర్తన కేవలం నగరాలకే పరిమితం కాకూడదని, అది సమ్మిళితంగా, ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి (HD Kumaraswamy) అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘లైట్ ఎలక్ట్రిక్-వెహికల్ యాక్సిలరేషన్ ఫోరమ్ (LEAF – Light Electric Vehicle Acceleration Forum)’ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

EV charging ecosystem : విశ్వసనీయత ముఖ్యం

ఈవీ రంగంలో భవిష్యత్తు సవాళ్లపై మంత్రి మాట్లాడుతూ, కేవలం మరిన్ని ఛార్జింగ్ పాయింట్లను పెంచడంపైనే కాకుండా, వాటిపై విశ్వసనీయత క‌లిగించ‌డంతోపాటు సులభంగా అందుబాటులో ఉండేటా చూసుకోవాల‌ని సూచించారు.

పరస్పర అనుసంధానం (Interoperability): ఛార్జింగ్ వ్యవస్థల (EV charging ecosystem) మధ్య అనుసంధానం ఉండాలని, అప్పుడే వినియోగదారులకు నిరంత‌ర‌ సేవలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అందుబాటు ధరలు: సామాన్యులకు అందుబాటు ధరలో వాహనాలను అందించడం, పరిశ్రమకు అది ఆచరణాత్మకంగా ఉండటంపై మన విధానాలు ఉండాలని స్పష్టం చేశారు.

ప్రపంచానికే దిక్సూచిగా భారత్

లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలే ప్రాథమిక రవాణా సాధనాలని, ఈ విభాగంలో తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను భారత్ అభివృద్ధి చేయగలిగితే.. ప్రపంచానికే నాయకత్వం వహించవచ్చని కుమారస్వామి అన్నారు.

“మనం ఇక్కడ సృష్టించే Scalable పరిష్కారాలను ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి వర్ధమాన మార్కెట్లకు ఎగుమతి చేయవచ్చు. ఇది భారతదేశానికి ఒక గొప్ప అవకాశం.” – హెచ్‌డి కుమారస్వామి

ఏమిటీ ‘లీఫ్’ (LEAF)?

  • ఎలక్ట్రిక్ ద్విచక్ర , త్రిచక్ర వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి పరిశ్రమల నేతృత్వంలో ఏర్పడిన ఒక తటస్థ కన్సార్టియం ఇది.
  • భాగస్వామ్య సంస్థలు: హీరో మోటోకార్ప్ (HeroMotoCorp) (ఎమర్జింగ్ మొబిలిటీ యూనిట్), ఏథర్ ఎనర్జీ, ఐపెక్ ఇండియా (I-PACE India) సంయుక్తంగా దీనిని ముందుకు నడిపిస్తున్నాయి.
  • లక్ష్యం: దేశవ్యాప్తంగా నిరాటంకమైన ఛార్జింగ్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ ఈవీ హబ్‌గా మార్చడం.

ఈ కార్యక్రమంలో లీఫ్ వ్యవస్థాపక సభ్యులు కౌసల్య నందకుమార్ (హీరో మోటోకార్ప్), రవ్‌నీత్ ఎస్ ఫోకెలా (ఏథర్ ఎనర్జీ), జోహ్రా ఖాన్ (ఐపెక్ ఇండియా) పాల్గొని, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు