Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఈ-బస్సులు

Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఈ-బస్సులు

Hyderabad : హైద‌రాబాద్‌లో వాయు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు TGSRTC ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇందులోభాగంగా భాగ్యనగరంలో డీజిల్ బ‌స్సుల స్థానంలో ద‌శ‌ల‌వారీగా ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను తీసుకొస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు TGSRTC ఇప్ప‌టివ‌ర‌కు 1389 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో 822 బస్సులు మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకానికి కేటాయించింది .

కొత్త‌గా 353 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్ల‌గొండ, సూర్యాపేటలలో 446 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 116.13 కోట్ల ఉచితంగా ప్ర‌యాణించార‌ని, దీని ద్వారా కార్పొరేషన్‌కు రూ.3,913.81 కోట్ల ఆదాయం వచ్చిందని టీజీఎస్‌ఆర్‌టీసీ తన ప్రగతి నివేదికలో పేర్కొంది.

టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకునే ప్రయాణికుల సంఖ్య రోజుకు 27 శాతం పెరుగుదలతో రోజుకు సగటున 45 లక్షల నుంచి 58 లక్షలకు పెరిగిందని, మహిళా ప్రయాణికుల సంఖ్య 40 శాతం నుంచి 65 శాతానికి పెరిగిందని తెలిపింది. ఒక‌ సంవత్సరంలో 1389 కొత్త TGSRTC బస్సులు ప్రారంభించింద‌ని తెలిపారు.

గత ఏడాదిలో 1,389 కొత్త బస్సులను ప్రవేశపెట్టినట్లు కార్పొరేషన్‌ పేర్కొంది. హైదరాబాద్‌-శ్రీశైలం రూట్‌లో 10 రాజధాని ఏసీ బస్సులు, హైదరాబాద్‌లో 75 డీలక్స్‌ బస్సులు, 125 మెట్రో డీలక్స్‌ బస్సులు, హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్ ల‌లో 251 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చామ‌ని తెలిపింది.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మేలో 21 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయగా 42,057 మంది ఉద్యోగులు, 11,014 మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరిందని కార్పొరేషన్ పేర్కొంది. TGSRTC కూడా RTC ఉద్యోగి మరణానికి కోటి రూపాయల బీమా ఇస్తున్నట్లు పేర్కొంది. 440 మంది ఉద్యోగులు తమ అత్యుత్తమ పనితీరుకు అవార్డులు అందుకున్నారు.

ఆర్టీసీ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులు

Hyderabad తార్నాకలోని TGSRTC హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. MRI, CT స్కాన్, ఎమర్జెన్సీ వార్డులు, 24 గంటల ఫార్మసీ, ఫిజియోథెరపీ యూనిట్లు నిర్మించారు. కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు సంబంధించి 12 ఏళ్ల తర్వాత ఇటీవల 3,038 పోస్టులు మంజూరుకాగా, ఖాళీగా ఉన్న 557 పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేశారు.
పెద్దపల్లి, ఏటూరునాగారం(ములుగు)లో కొత్తగా మంజూరైన 2 బస్ డిపోలతో పాటు హుస్నాబాద్‌లోని బస్‌స్టేషన్‌ను సుందరీకరించడంతోపాటు జనగాంలోని ఒక డిపోను విస్తరించారు.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు