
Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్లో 353 కొత్త ఈ-బస్సులు
Hyderabad : హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు TGSRTC పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా భాగ్యనగరంలో డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు TGSRTC ఇప్పటివరకు 1389 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో 822 బస్సులు మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకానికి కేటాయించింది .కొత్తగా 353 ఎలక్ట్రిక్ బస్సులుమార్చి 2025 నాటికి హైదరాబాద్లో 353 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేటలలో 446 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ఆర్టిసి) తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 116.13 కోట్ల ఉచితంగా ప్రయాణించారని, దీని ద్వారా కార్పొరేషన్కు రూ.3,...