MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు.

ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150, బార్లీ రూ.130, మినుము రూ.130, మినుము క్వింటాల్‌కు రూ.210 చొప్పున ఎంఎస్‌పి (MSP Hike) పెంచాలని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో మినుము, కందుల ధర క్వింటాల్‌కు రూ.5440 ఉండగా, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.5,650కి పెరిగింది. 2014-15తో పోలిస్తే, ప్రభుత్వం పంటల ఎంఎస్‌పిని దాదాపు రెట్టింపు చేసింది.

  • గోధుమలు- రూ.2275 నుంచి రూ.2425కి పెరిగింది
  • బార్లీ- రూ.1850 నుంచి రూ.1980కి పెరిగింది
  • శనగపప్పు – రూ.5440 నుంచి రూ.5650కి పెరిగింది
  • కందిపప్పు- రూ.6425 నుంచి రూ.6700
  • రేప్‌సీడ్/ఆవాలు- రూ.5650 నుంచి రూ.5950కి పెరిగింది
  • కుసుమ – రూ.5800 నుంచి రూ.5940కి పెరిగింది

డీఏ 3 శాతం పెంపు

కేంద్ర ఉద్యోగులకు కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి, జూలైలో ఏడాదికి రెండుసార్లు డీఏను అంచనా వేసి, సర్దుబాటు చేసి, ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది.

కేంద్రం తాజా నిర్ణయంతో 49.18 లక్షల మంది ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 50 శాతం డీఏకు అర్హులు కాగా, పెన్షనర్లు తమ బేసిక్ పెన్షన్‌లో 50 శాతం డీఆర్‌ను పొందుతున్నారు. ప్రస్తుతం, కొత్త ప్రకటన తర్వాత, ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతం నుండి 53 శాతానికి పెరుగుతుంది. డీఏ పెంపు తర్వాత దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు