Solar Powered Model Villages

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Spread the love

Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను ఏర్పాటు చేాయలని సూచించారు. సోలార్ కంపెనీల నుంచి వారంటీలతో కూడిన అధిక-నాణ్యత గల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె సోలార్ పవర్ యూనిట్లకు సబ్సిడీలు అందించే ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం (మఫ్ట్ బిజిలీ యోజన) Pradhan Mantri Surya Ghar scheme (Muft Bijli Yojana) ప్రాముఖ్యతను గురించి వివరించారు.

జిల్లాలోని అన్ని కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సోలార్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సౌరశక్తి వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకతను కలెక్టర్ ప్రస్తావించారు. సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను మనం వినియోగిస్తున్నామని, మిగిలిన వాటి ద్వారా ప్రజలకు ఆదాయం సమకూరుతుందని ప్రచారం చేయాలని ఆమె పేర్కొన్నారు.

విద్యుత్ శాఖ నుంచి SEG ప్రసాద్ పథకం లక్ష్యాలను వివరించారు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మెరుగుపరచడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం దీని లక్ష్యం. జిల్లాలో 30 వేల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. వినియోగదారులు 1,300 రూపాయల ప్రాసెసింగ్ రుసుము చెల్లించి 10 కిలోవాట్ల వరకు ఇన్‌స్టాలేషన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కిలోవాట్‌కు రూ.30,000 , రెండు కిలోవాట్‌లకు రూ.60,000, మూడు కిలోవాట్‌లకు రూ.78,000 , రాయితీ లభిస్తుందని తెలిపారు. ఇంకా, వినియోగదారులకు పెట్టుబడి కోసం సహాయం చేయడానికి బ్యాంక్ రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇన్సెంటివ్‌లు ఉన్నప్పటికీ, సోలార్ ఇన్ స్టలేషన్లో పురోగతి నెమ్మదిగా ఉందని, జిల్లాలో 1,677 మంది దరఖాస్తు చేసుకోగా, 288 మంది మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపును పూర్తి చేశారని అధికారులు తెలిపారు.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

More From Author

Ayurvedic medicinal plants

Medicinal plants | ఈ మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి..

New Agriculture Schemes 2025

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *