
DelhiAir Pollution : నేటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్.. వాహనాలకు కఠిన నిబంధనలు!
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (DelhiAir Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వాయు నాణ్యత సూచిక (AQI) ‘తీవ్రమైన’ వర్గంలోకి పడిపోవడంతో గురువారం (నేటి) నుండి GRAP-4 పరిమితులకు అదనంగా మరికొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.సగం మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తప్పనిసరిఢిల్లీ కార్మిక మంత్రి కపిల్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి ఇంటి నుండే పని (WFH) సౌకర్యం కల్పించాలి. ఆసుపత్రులు, అగ్నిమాపక శాఖ, పారిశుధ్యం, రవాణా వంటి అత్యవసర సేవల్లో పనిచేసే ఫ్రంట్లైన్ కార్మికులకు ఈ నిబంధన వర్తించదు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.PUC లేకపోతే పెట్రోల్ పోయరు!వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణ మంత్రి మంజి...




