Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీటర్ల రేంజ్
భారతదేశపు మొట్ట మొదటి ఎలక్ట్రిక్ క్రుయిజర్
దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ 'క్రూయిజర్ ను కొమాకి సంస్థ రూపొందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ
వరకు ప్రయాణించవ్చు. ఇదే కనుక మార్కెట్లోకి వస్తే భారతదేశపు ఎక్కువ రేంజ్ ఇచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలవనుంది.Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ జనవరి 2022లో క్రూయిజర్- స్టైల్ ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ బైక్కు 'రేంజర్' అని నామకరణం చేసిన టీజర్ను తాజాగా విడుదల చేసింది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జింగ్లో 250 కిమీ రైడింగ్ రేంజ్ను క్లెయిమ్ చేస్తుంది.
4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్
Komaki Ranger లో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ అని, ఇది 250 కిమీ రేంజ్ను అందిస్తుందని కోమాకి కంపెనీ పేర్కొంది. కొమ...