
BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి
పాకిస్తాన్, థాయిలాండ్ ఆధిపత్యానికి సవాలున్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబల్ ఇండెక్స్ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల దిగుమతులను భర్తీ చేసే అవకాశం ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్, థాయిలాండ్ ఆధిపత్యం ఉన్న బియ్యం మార్కెట్లపై భారత ప్రభావాన్ని పెంచనుంది. దీంతో పాకిస్తాన్లో ఇప్పటికే ఉన్న ఆర్థిక ఒత్తిడులు మరింత తీవ్రం కానున్నాయని అంచనా వేస్తున్నారు.ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ (BIRC 2025)రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలో ఫిలిప్పీన్స్, ఘనా, నమీబియా, గాంబియా విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు. APEDA చైర్మన్ అభిషేక్...

