BPCL : ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 1800 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు
ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించన పెట్రోల్ బంకుల్లో సుమారు 1800 డీసీ ఫాస్ట్ చార్జర్ల ఏర్పాటుకు కీలక ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్ తయారీదారు అయిన సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ (Servotech Power Systems ) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నుండి 1800 DC ఫాస్ట్ EV ఛార్జర్ల ఏర్పాటు కోసం ఆర్డర్ను పొందింది.రూ. 120 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ కింద 60 kW, 120 kW రెండు ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నారు. భారతదేశమంతటా ఈ 1,800 EV ఛార్జర్ల (EV chargers) ను ముఖ్యంగా ప్రధాన నగరాల్లోని BPCL పెట్రోల్ పంపుల వద్ద సర్వోటెక్ సంస్థ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఇది BPCL E-డ్రైవ్ ప్రాజెక్ట్లో భాగం, ఇది EV ఛార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తరించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 2024 చివరి నాటికి ఈ 1,800 ఛా...