
Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!
Indian Agriculture 2047 | 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (Viksit Bharat) మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించనుందని తాజా ఆర్థిక సర్వే (Economic Survey 2026) స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయం స్థిరమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఉత్పాదకత లోపాలు, వాతావరణ మార్పు ప్రభావాలు, నిర్మాణాత్మక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినవిగా ఉన్నాయని సర్వే హెచ్చరించింది. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయం, సమ్మిళిత వృద్ధి సాధించడంలో మరియు కోట్లాది మంది రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కేంద్రబిందువుగా ఉంటుందని సర్వే పేర్కొంది.అంకెల్లో వ్యవసాయం: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంభారతదేశ జాతీయ ఆదాయంలో దాదాపు 20 శాతం వాటా వ్యవసాయానిదే. విచిత్రమేమిటంటే, దేశంలోని 46.1 శాతం శ్రామిక శక్తి ఇప్పటికీ ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తోంది. గత ఐదేళ్లలో ...


