New EV Policy | ఎల‌క్ట్రిక్ వాహ‌న కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. రేప‌టి నుంచే తెలంగాణ‌లో కొత్త‌గా ఈవీ పాల‌సీ..

New EV Policy | ఎల‌క్ట్రిక్ వాహ‌న కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. రేప‌టి నుంచే తెలంగాణ‌లో కొత్త‌గా ఈవీ పాల‌సీ..

New EV Policy | రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఈవీ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టింది. ఇది రేప‌టి నుంచే అమ‌లులోకి రానుంది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 41 కింద తెలంగాణ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానాన్ని రేపటి నుండి ప్రారంభించనుంది. ఈ చొరవలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.

కొత్త ఈవీ పాల‌సీ గురించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. . “మేము హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం. హైద‌రాబాద్ లో ఢిల్లీ లో మాదిరిగా కాలుష్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాము. సాంప్రదాయ ఇంధన ఆధారిత రవాణాకు స్థిరమైన, స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాన్ని అందించడమే లక్ష్యం” అని మంత్రి చెప్పారు.

కాగా, తెలంగాణ అంతటా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కొత్త విధానం పెద్ద ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో పాటు, మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు తయారీదారులకు మ‌రిన్ని ప్రోత్సాహకాలతో సహా మౌలిక సదుపాయాల మెరుగుదలలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ప్రధాన నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో గాలి నాణ్యతపై పెరుగుతున్న ఆందోళన, పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర EV పాల‌సీ ఒక వ్యూహాత్మక చర్యగా చెప్ప‌వచ్చు. ఈ కొత్త పాల‌సీ ద్వారా ఎక్కువ మందిని ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా ప్రోత్సహిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త విధానం హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రణాళికలను కూడా మంత్రి పొన్నం వెల్ల‌డించారు. గతంలో 2020-2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుందన్నారు. హైదరాబాద్ లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సిఎం రేవంత్‌ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సిటీ లో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయ‌ని చెప్పారు. 2026 డిసెంబర్ 31 వరకు ఈవీ పాలసీ ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ జీహెచ్ ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ఈవి పాలసీ ఉంటుందని, తెలంగాణ ప్రజలు ఈవీ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరారు.

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు