Organic Farming

Compost | కిచెన్ గార్డెన్ కోసం మీరే సొంతంగా కంపోస్ట్ ఎరువును ఇలా తయారు చేసుకోండి..
Organic Farming

Compost | కిచెన్ గార్డెన్ కోసం మీరే సొంతంగా కంపోస్ట్ ఎరువును ఇలా తయారు చేసుకోండి..

Compost Making At Home :  మనం ఒక రోజులో ఎంత గృహ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చింతన్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ యాక్షన్ గ్రూప్ నివేదిక ప్రకారం..  పెద్ద నగరాల్లోని మధ్యతరగతి కుటుంబాలు రోజుకు దాదాపు 0.8 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. గృహాలలో నుంచి వచ్చే వ్యర్థాల్లో దాదాపు 60% లేదా అంతకంటే ఎక్కువ భాగం సేంద్రీయ పదార్థమే ఉంటుంది. మీ వంటగది వ్యర్థాలను అనవసరమని చెత్తకుప్పలో పడేయకుండా దానిని కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం అత్యుత్తమమైన మార్గం.అపార్ట్‌మెంట్లలో ఉన్నవారుకూడా ఈజీగా కంపోస్ట్ ను తయారు చేసుకొని టెర్రస్ గార్డెన్ కోసం చక్కగా వినియగించుకోవచ్చు. మీరు మీ రోజువారీ డస్ట్‌బిన్ కంటెంట్‌లను గొప్ప సేంద్రీయ ఎరువుగా మార్చవచ్చు. దానితో పూలమొక్కలు, కూరగాయల మొక్కలను పెంచుకోవచ్చు.సేంద్రీయ వ్యవసాయంలో కంపోస్ట్ చాలా ముఖ్యమైనది.  కంపోస్ట్ ఎరువు మొక్కలకు అనేక రక...
Irrigation | వ్యవసాయంలో నీటిపారుదల ఖర్చులను ఇలా తగ్గించుకోండి..
Organic Farming

Irrigation | వ్యవసాయంలో నీటిపారుదల ఖర్చులను ఇలా తగ్గించుకోండి..

Irrigation | దేశంలోని చాలా రాష్ట్రాల్లో అన్నదాతలను నీటికొరత వేధిస్తోంది. బోర్లు ఎండిపోయి, జలాశయాలు ఇంకిపోయి పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతులు అప్పులపాలై కూనారిల్లిపోతున్నారు. అయితే వ్యవసాయంలో నీటిపారుదల చాలా కీలకం.. సాగు పెట్టుడిలో అతిపెద్ద ఖర్చులలో ఇది కూడా ఒకటి. నీటిపారుదల,  నీటి నిర్వహణకు సంబంధించి ఖర్చులు చాలా ఉంటాయి.  బావులు, కాలువలు, ట్యాంకులు లేదా చెరువుల నుండి నీటిని సేకరించడం,  నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్ లేదా డీజిల్‌పై రైతులు ఖర్చు చేస్తుంటారు.ఎకరానికి నీటిపారుదల,  నీటి నిర్వహణ ఖర్చులు ప్రతి పంటకు నీటి డిమాండ్,  దాని కరెంటు యూనిట్ ధరపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గోధుమలకు, భౌగోళిక స్థితిని బట్టి హెక్టారుకు 13,000 క్యూబిక్ మీటర్ల నుండి 20,000 క్యూబిక్ మీటర్ల  నీటి అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు నీటిపారుదల ఖర్చులను తగ్గించుకోగలిగితే, అది మరింత పొదుపు మరియు లాభం పెరుగుతుం...
Saffron Cultivation : ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. కిలోకు రూ.3 నుంచి 6 లక్షల్లో సంపాదన..
Organic Farming

Saffron Cultivation : ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. కిలోకు రూ.3 నుంచి 6 లక్షల్లో సంపాదన..

Saffron Cultivation | భారతదేశంలో కుంకుమపువ్వును ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం జమ్మూ కశ్మీర్.  బంగారు-రంగు పుప్పొడిని కలిగి ఉంటుంది. జమ్మూ కశ్మీర్‌లో సంవత్సరానికి ఒకసారి కుంకుమపువ్వు పండిస్తారు. ఎంతో విలువైన ఈ కుంకుమ పువ్వు (Saffron)  ను "ఎర్ర బంగారం" అని పిలుస్తారు.భారతదేశంలో కుంకుమపువ్వు ఉత్పత్తికి కేంద్రంగా కశ్మీర్ నిలుస్తోంది.  ప్రపంచంలోనే కుంకుమపువ్వు  ఉత్పత్తిలో కశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది.కానీ కాశ్మీర్ లోయకు దూరంగా మీ ఇంట్లో కూడా పుట్టగొడుగులను పెంచినట్లుగా కుంకుమ పువ్వును పెంచవచ్చని మీకు తెలుసా.. అవును కాస్త కష్టపడితే ఇది సాధ్యమే.. ఓ రిటైర్డ్ ఇంజినీర్ స్వయంగా ఇంట్లోనే కుంకుమ పువ్వును సాగుచేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.  నోయిడాకు చెందిన రమేష్ గేరా తన ఇంట్లోని ఒక చిన్న గదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వు మొక్కలను చుస్తే మీరు ఆశ్చర్యపోతారు.1980లో NIT కురుక్షేత...
Millets Farming | అందరూ ఈమెను ‘క్వీన్ ఆఫ్ మిల్లెట్స్’ పిలుస్తారు.. గిరిజన మహిళా రైతు ఘనత చూస్తే
Organic Farming

Millets Farming | అందరూ ఈమెను ‘క్వీన్ ఆఫ్ మిల్లెట్స్’ పిలుస్తారు.. గిరిజన మహిళా రైతు ఘనత చూస్తే

queen of millets | ఒడిశాలోని గిరిజన భూమియా కమ్యూనిటీకి చెందిన 36 ఏళ్ల రైమతి ఘియురియా ఒక సాధార‌ణ గిరిజన మ‌హిళా రైతులా క‌నిపిస్తుంది. కానీ గతేడాది సెప్టెంబరు 9న న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ఒడిశా త‌ర‌పున ఆమె ప్రాతినిధ్యం వహించింది. కోరాపుట్ జిల్లాలో సంప్ర‌దాయ వ‌రి, చిరుధాన్యాల (millets) వంగ‌డాల‌ను సంరక్షించడంలో ఆమె అద్భుత‌మైన జీవ‌న ప్ర‌యాణాన్ని వివ‌రించినప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్యపోయారు. సేంద్రియ రైతుగా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా, అనుభవజ్ఞుడైన శిక్షకురాలిగా ఆమె సాధించిన అద్భుతమైన విజయాలు వెలుగులోకి వచ్చాయి.. అయితే ఈ ఆద‌ర్శ మ‌హిళా రైతు గురించి మ‌న‌మూ తెలుసుకుందాం..కుంద్రా బ్లాక్‌లోని నౌగూడ గ్రామానికి చెందిన రైమతి (Raimati Ghiuria )  తన భర్త గోబింద ఘియురియా, వారి ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు.  సేంద్రియ వ్యవసాయానికి కట్టుబడి , ఆమె 2500 మంది సహచర రైతులకు శిక్షణ ఇచ్చింది. సేం...
Organic agriculture | సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఏడు చిట్కాలు
Organic Farming

Organic agriculture | సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఏడు చిట్కాలు

Organic agriculture| వ్యవసాయం (రసాయనాల వినియోగంతో సాగు) నుండి సేంద్రియ వ్యవసాయానికి వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, భూసారాన్ని మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి రైతులు కొన్ని మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.మానవ ఆరోగ్యం, పర్యావరణంపై రసాయన ఎరువులు, పురుగుమందుల హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెరగడంతో, చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.  భారతదేశం దీనికి మినహాయింపు కాదు.సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఇది నేల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది, జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహిస్తుంది, కాలుష్యాన్ని నివారిస్తుంది, వ్యవసాయ ఖర్చులను తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేస్తుంది.What are the methods of natural farming?...
Organic Farming | ఆరోగ్యకరమైన పంటలకు.. సేంద్రియ పద్ధతులే శరణ్యం.. సేంద్రియ సాగుతో లాభాలు ఇవే..
Organic Farming

Organic Farming | ఆరోగ్యకరమైన పంటలకు.. సేంద్రియ పద్ధతులే శరణ్యం.. సేంద్రియ సాగుతో లాభాలు ఇవే..

సేంద్రియ సాగుతో లాభాలు బాగు.. ఇటీవల కాలంలో కొందరు అధిక దిగుబడులు రావాలని పరిమితికి మించి హానికరమైన పురుగుమందులు, ఎరువులు వినియోగించి విషతుల్యమైన పంటలను పండిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. భారతదేశంలో జనాభా పెరుగుదల కారణంగా ఆహారానికి డిమాండ్ పెరుగుతోంది. ఆహార ఉత్పత్తి అవసరాన్ని తీర్చేందుకు ఎక్కువగా రసాయన ఎరువులు, పురుగుమందులు, హైబ్రిడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా తీసుకోవడం వల్ల ప్రజల్లో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.అయితే ఇదే సమయంలో ఇప్పుడు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం గురించి ప్రజలు, రైతుల్లో అవగాహన పెరుగుతోంది. మానవుల ఆరోగ్యంతోపాటు నేలతల్లికి మేలు చేసే సేంద్రియ ఎరువులను రైతులు వినియోగిస్తున్నారు. ప్రాణాంతక రసాయనాల నుంచి మనతోపాటు ప్రకృతిని రక్షించుకోవడానికి సేంద్రియ వ్యవసాయమే ఏకైక మార్గం. సేంద్రియ సాగు గురించి తెలుసా? అయితే భారతదేశంలో ఉత్తమమైన సమర్థవంత...
organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
Organic Farming

organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

Organic fertilizers|సాగులో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల క్రమంగా  భూసారం దెబ్బతింటుంది. అలాంటి పంటలు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. మరోవైపు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమ స్థాయిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి ద్వారా వారు పండించే పంటలకు మార్కెట్లో ఎప్పుడు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అన్ని విధాలా శ్రేష్ఠమైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంపోస్టు ఎరువు పంటల సాగులో మిగిలిపోయిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఎరువు తయారు చేసుకోవచ్చు.. ఎత్తయిన ప్రదేశంలో 1 మీ. లోతు, 2 మీ. వెడల్పు, తగినంత తగినంత పొడవు గొయ్యి తవ్వాలి.. వ్యర్థాలను 30 సెం.మీ. మందం పొరలుగా పేర్చుకుంటూ.. మధ్య మధ్యలో.. పేడ నీళ్లను, 8-10 కి. సూపర్‌ ఫాస్పేట్‌ చొప్పున ఒక్కొక్క పొరలో వేస్తూ నేల మట్టానికి అర మీటరు ఎత్తు వర...
Wheat | ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. డయాబెటిస్ ను కట్టడి చేసే మరో కొత్త వంగడం..
Organic Farming

Wheat | ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. డయాబెటిస్ ను కట్టడి చేసే మరో కొత్త వంగడం..

జర్మనీ పరిశోధకుల నుంచి సరికొత్త వంగడం కేవలం పది వారాల్లోనే పంట చేతికి నీటి వినియోగం కూడా 95 శాతం తక్కువేఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వరదలు, కరువు కాటకాలు ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా ఇందుకు మరో అవరోధంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్ల్యూఎఫ్ పీ) అంచనాల ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటికే 82.8 కోట్ల మంది ఆకలితో అల్లాడిపోతున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది 49 దేశాల్లో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని డబ్ల్యూఎఫ్ పీ హెచ్చరించింది. అలాగే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ఆకలి కేకలను పెంచేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్మనీ పరిశోధకులు ఊహించని శుభవార్త చెప్పారు. ఏడాదికి ఏకంగా ఆరు సార్లు పంట దిగుబడినిచ్చే ప్రత్యేక గోధుమ Wheat వంగడాన్ని రూపొందించినట్లు మ్యూనిచ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..