Harithamithra Telugu News

Home EV Updates దేశ వ్యాప్తంగా EVTRIC dealerships

దేశ వ్యాప్తంగా EVTRIC dealerships

0
EVTRIC-dealership

EV స్టార్టప్ EVTRIC మోటార్స్ దేశవ్యాప్తంగా తన పరిధిని వేగంగా విస్తరిస్తోంది. గత ఆరు నెలల్లోనే ఈ కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. 2022 చివరి నాటికి తమ EVTRIC-dealership నెట్‌వర్క్‌ను 110 నుండి 350కి విస్తరించాలని భావిస్తోంది. ఫేజ్ IIలో తూర్పు, దక్షిణ భారత రాష్ట్రాల్లో మరింత విస్తరించేందుకు ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేసింది.

రెండు రాష్ట్రాల్లో విరివిగా అమ్మ‌కాలు..
ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి ప్రధాన రాష్ట్రాల్లో EVTRIC స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో EVTRIC మోటార్స్ కోసం అత్యధిక సంఖ్యలో అమ్మకాలు న‌మోద‌య్యాయి. అవి దేశంలోని సహా టైర్ II, టైర్ III నగరాల్లో EVTRIC-dealership కలిగి ఉంది.

EVTRIC మోటార్స్ వ్యవస్థాపకుడు, MD మనోజ్ పాటిల్ మాట్లాడుతూ.. “COVID-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఆటోమోటివ్ పరిశ్రమకు బ్రేక్ వేసిన‌ప్ప‌టికీ త‌మ బ్రాండ్, ఉద్యోగుల హృదయపూర్వక కృషితో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నెమ్మదిగా బలమైన నెట్‌వర్క్‌ను ఏర్ప‌రుచుకుంద‌ని తెలిపారు.

కంపెనీ తమ ప్రయాణాన్ని రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ప్రారంభించింది. అవి యాక్సిస్, రైడ్( Axis, Ride) రైడ్ మోడ‌ల్ ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడవుతుతోంది. ఈ Ride Electric Scooter గరిష్టంగా 25kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఒక్కో ఛార్జీకి 75km రేంజ్‌ను అందిస్తుంది. కస్టమర్ల వివిధ అవసరాలు తీర్చేందుకు EVTRIC కంపెనీ త్వ‌ర‌లో ఏడు వేర్వేరు Electric Vehicles ను తీసుకుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. EV ఇండియన్ ఎక్స్‌పోలో, EVTRIC మూడు కొత్త మోడళ్లను ప్ర‌ద‌ర్శించింది. స్లో స్పీడ్, అలాగే హై-స్పీడ్ స్కూటర్‌లు రెండూ కూడా 100kmph గరిష్ట వేగాన్ని అందుకోగల ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు ఈ కంపెనీ చార్ట్‌లో ఉన్నాయి. EVTRIC స్కూటర్లు iCATచే ఆమోదించబడ్డాయి. భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి. ఈవీట్రిక్ కంపెనీ 100 శాతం ఇండియాలోనే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు.

Previous article150km రేంజ్ తో Tata Ace EV
Next articleదేశ‌వ్యాప్తంగా 500 EV battery health check-up centres
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here