Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో ఎకరానికి ₹2 లక్షల ఆదాయం!

Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో ఎకరానికి ₹2 లక్షల ఆదాయం!


తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు (Oil Palm Cultivation)ను ప్రోత్సహించడం ద్వారా రైతాంగం ఆర్థికంగా బలోపేతం కానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పాల్వంచమర్రి గ్రామంలో జరిగిన ‘మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సాగు విస్తరణకు రూ.456 కోట్ల కేటాయింపు

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ఉధృతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.88 లక్షల ఎకరాల్లో ఈ సాగు ఉండగా, ఈ ఏడాది అదనంగా 1.25 లక్షల ఎకరాల్లో సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.456 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

ఆయిల్ పామ్ సాగు విశేషాలు ,ప్రయోజనాలు:

  • దీర్ఘకాలిక ఆదాయం: ఈ పంట నాటిన 4 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమై, 30 నుండి 40 ఏళ్ల పాటు నిరంతర ఆదాయాన్ని అందిస్తుంది.
  • అధిక లాభాలు: ఏడాదికి ఎకరానికి సుమారు రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.
  • అంతర పంటలు: ఆయిల్ పామ్ తోటల్లో ఇతర పంటలను సాగు చేస్తూ రైతులు అదనపు లాభాలు పొందవచ్చు.
  • మార్కెట్ భరోసా: మార్కెటింగ్ సమస్యలు లేకుండా రైతులు నిశ్చింతగా సాగు చేయదగ్గ పంట ఇది.

రైతులకు భారీ రాయితీలు

ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఎకరాకు ₹51,000 సబ్సిడీ: మొక్కలు, ఎరువులు మరియు డ్రిప్ సౌకర్యం కోసం ప్రభుత్వం ఎకరాకు రూ. 51,000 సబ్సిడీ రూపంలో అందిస్తోంది. అదనపు ప్రోత్సాహకం: హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ డ్రిప్ సౌకర్యానికి అదనంగా రూ. 5,000 ప్రోత్సాహకాన్ని ఇస్తున్నట్లు ప్రతినిధి వరుణ్ మెహతా తెలిపారు.

స్వయం సమృద్ధి లక్ష్యం

దేశంలో పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు మిల్లులు అందుబాటులో ఉండగా, సిద్దిపేట జిల్లా నర్మేట్టలో త్వరలో కొత్త ఫ్యాక్టరీ ప్రారంభం కానుందని తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాలకు పైగా ఈ పంటను విస్తరించేందుకు రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు మరియు హిందుస్థాన్ యూనిలీవర్ ప్రతినిధులు పాల్గొన్నారు.


🌱 పర్యావరణ హితం – భవిష్యత్‌కు బాట!

Green Mobility, Solar Energy, Electric Vehicles, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం Harithamitra ను సందర్శించండి.

📢 Daily Updates కోసం మా Social Media లో Join అవ్వండి

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు